కోలుకున్న అమితాబ్పై అమూల్ ప్రత్యేక కార్టూన్
పాలు, పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ దేశీయంగా ఎంతో పాపులర్. అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబించేలా తమ అమూల్ బ్రాండ్ గర్ల్ బొమ్మతో కూడిన కార్టూన్లు వేస్తుంటుంటుంది. తాజాగా బాలీవుడ్లో సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కోసం
ఇంటర్నెట్ డెస్క్: పాలు, పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ దేశీయంగా ఎంతో పాపులర్. అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబించేలా తమ అమూల్ బ్రాండ్ గర్ల్ బొమ్మతో కూడిన కార్టూన్లను రూపొందిస్తుంటుంది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కోసం ప్రత్యేక కార్టూన్ రూపొందించింది. ప్రస్తుతం ఈ కార్టూన్ సోషల్మీడియాలో వైరల్గా మారింది.
గత నెలలో అమితాబ్, ఆయన కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో వారంతా ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజులకు అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య కరోనా నుంచి కోలుకున్నారు. మూడ్రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ కూడా కోలుకొని డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు. ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిన ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో అమూల్ సంస్థ కూడా అమితాబ్ బచ్చన్కు అభినందనలు తెలుపుతూ ప్రత్యేక కార్టూన్ను రూపొందించింది. కూర్చిలో అమితాబ్ కూర్చొని ఒక చేతిలో మొబైల్ ఫోన్, మరో చేతి వేలితో వెన్న పట్టుకొని ఉన్నట్లు.. అమూల్ గర్ల్ ఆయన భూజాలపై వాలి మొబైల్ను చూస్తున్నట్లుగా కార్టూన్ ఉంది. దీనిపై ‘ఏబీ బీట్స్ సీ’(అమితాబ్ బచ్చన్ కరోనాను ఓడించారు అనే ఉద్దేశంతో)అని రాశారు. ఈ అమూల్ కార్టూన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
తనను ఉద్దేశిస్తూ అమూల్ రూపొందించిన కార్టూన్పై అమితాబ్ బచ్చన్ స్పందించారు. ‘‘మీ ప్రత్యేకమైన పోస్టర్ ప్రచారంలో నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా అమూల్ నన్ను సత్కరిస్తోంది. ఓ సాధారణ వ్యక్తిని అమూల్యంగా మార్చింది’’అని అమితాబ్ ఆ కార్టూన్ను తన ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం