Anandam: హృదయాన్ని హత్తుకున్న ‘ఆనందం’కి 20ఏళ్లు
టాలీవుడ్లో వచ్చిన చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రం ‘ఆనందం’కి 20ఏళ్లు
ఇంటర్నెట్ డెస్క్: తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ‘ఆనందం’. టీవీల్లో ఇప్పుడు ప్రసారమైనా సరే ప్రేక్షకులను కదలనివ్వకుండా కట్టిపడేసేంత ఫీల్గుడ్ లవ్ స్టోరీగా దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించారు. ఇదే ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. హీరో ఆకాశ్ను ఓవర్నైట్ స్టార్ని చేసింది. సంగీత దర్శకుడిగా అప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైన దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్ ఆయన్ను మరో మెట్టు ఎక్కించింది. మెలోడి పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వాలంటే దేవీ తరువాతే ఎవరైనా అని చెప్పుకునేలా చేసింది. కాలేజీలో హీరో-హీరోయిన్ల అల్లర్లు, ఫ్లాష్బ్యాక్లో వచ్చే లవ్ ట్రాక్, హౌస్ ఓనర్స్గా బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, కాలేజీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చిత్రం శీను, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, బబ్లూ పండించిన కామెడీ ఈ సినిమాకు బలం. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం విడుదలై నేటికి (సెప్టెంబరు 28) 20ఏళ్లు. మరి ఆ చిత్ర విశేషాలను తెలుసుకుందామా!
కథేంటంటే: చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లలో ఉంటారు కిరణ్ (ఆకాశ్) ఐశ్వర(రేఖ). ప్రతి చిన్న విషయానికీ గొడవ పడుతుంటారు. కాలేజీకి వెళ్లే వయసు వచ్చినా సరే.. ఒకరంటే ఒకరికి పీకల దాకా కోపం. ఒకరోజు ఐశ్వర కుటుంబం ఇల్లు ఖాళీ చేసి ఊటీకి షిఫ్ట్ అవుతారు. ఈ విషయం తెలిసిన కిరణ్ తనకు ఐశ్వర్య నుంచి విముక్తి లభించిందని పండగ చేసుకుంటాడు. అలా ఊటీలో ఓ ఇంట్లోకి వెళ్లాక ఐశ్వర్యకు దీపిక (తనూరాయ్) పేరుతో వచ్చిన ఉత్తరం, గ్రీటింగ్ కార్డ్ కనిపిస్తాయి. ఇప్పుడు తాము ఉండే ఇంట్లోనే గతంలో దీపిక వాళ్లు ఉండేవాళ్లని తెలుసుకున్న ఐశ్వర్య ఎలాగైనా ఆ లేఖ, గ్రీటింగ్ కార్డును దీపికకు అందించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే ఆమెకో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తాను వెతికే దీపిక సూసైడ్ చేసుకొని చనిపోయిందని దీపిక స్నేహితురాలు చెబుతుంది. దీపిక, వంశీ (వెంకట్) కాలేజీలో ప్రేమికులు. వెంకట్ తన తల్లిదండ్రులను ఒప్పించి వస్తానని చెప్పి ఊరు వెళ్లిపోతాడు. రోజులు గడుస్తున్నా రాకపోయే సరికి దీపికకి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసేందుకు సిద్ధమవుతారు. సున్నిత మనస్కురాలైన దీపిక ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక సూసైడ్ చేసుకుంటుంది. దీపిక లేదన్న నిజం వంశీకి తెలిస్తే ఏమైపోతాడోనని.. ఆమె పేరుతో ఐశ్వర్య లేఖలు రాయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? నిజానిజాలు ఎలా బయటపడ్డాయి. వంశీ పేరుతో ఉత్తరాలు రాస్తున్నది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
* 2001లో విడుదలైన చిత్రం 200రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. కొత్తతరాన్ని, కొత్త కథలను ఎప్పుడూ ప్రోత్సహించే నిర్మాత రామోజీరావు.. మరోసారి కొత్త దర్శకుడు శ్రీనువైట్ల, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్లో దాగి ఉన్న టాలెంట్ను గుర్తించి టాలీవుడ్కు మరపురాని చిత్రమిచ్చారు.
* అటు ఆకాశ్.. ఇటు రేఖ కూడా తెలుగులో తొలిచిత్రమైనా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
* తమిళంలో ‘ఇనిదు ఇనిదు కాదల్ ఇనిదు’, కన్నడలో ‘ఆనంద’ పేరుతోనూ విడుదలై.. అక్కడా మంచి టాక్ తెచ్చుకుంది. మూడు భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని రామోజీరావు నిర్మించారు.
* సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ‘కనులు తెరిచినా కనులు మూసినా’, ‘ఎవరైనా ఎప్పుడైనా’ పాటలు యూత్ను ఆకట్టుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!