Anasuya Bharadwaj: ‘ఉసురు ఊరికే పోదు’.. అనసూయ ట్వీట్‌ ఎవరినుద్దేశించి?

నటి, వ్యాఖ్యాత అనసూయ చేసిన ఓ ట్వీట్‌ చర్చకు దారితీసింది. ఎవరిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారో? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Published : 26 Aug 2022 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాఖ్యాత, నటి అనసూయ (Anasuya Bharadwaj)... తన అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా నిర్మొహమాటంగా తెలియజేస్తుంటారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్‌ నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎవరినుద్దేశించి అలా రాశారో? అంటూ నెట్టింట చర్చ సాగుతోంది. ‘‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేవటవ్వచ్చేమోకాని రావటం మాత్రం పక్కా!!’ అని అనసూయ తెలుగులో రాసి, #NotHappyOnsomeonesSadness but #FaithRestored అనే హ్యాష్‌ట్యాగ్‌లు జతచేశారు. ‘ఇతరుల బాధని చూసి ఆనందపడను కానీ నమ్మకం నిజమైంది’ అని అనసూయ ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియక చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ‘ఏం జరిగింది మేడమ్‌?’, ‘అర్థంకావట్లేదు’, ‘ఏదో సినిమా సంభాషణలా ఉందేంటి!’, ‘ఎవరిని? ఎందుకు అంటున్నారో స్పష్టత ఇవ్వండి’ అని అడుగుతున్నారు.

వ్యాఖ్యాతగా పలు కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ నటిగానూ ఆకట్టుకున్నారు. నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’, రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ తదితర చిత్రాల్లో పోషించిన విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల, అల్లు అర్జున్ హీరోగా గతేడాది వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈమె కీలక పాత్ర పోషించిన ‘రంగ మార్తాండ’ త్వరలో విడుదల కానుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రధారులు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని