ఆ మాట నేను అనలేదు: అనసూయ
నాకు సంబంధించిన ఏ విషయానైనా సోషల్మీడియా వేదికగా నన్ను అడిగి తెలుసుకోండి. అంతేకానీ, వేరేవాళ్లు రాసినవి గుడ్డిగా నమ్మేయకండి.’’ అని అంటున్నారు నటి అనసూయ....
హైదరాబాద్: ‘‘నాకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియా వేదికగా నన్ను అడిగి తెలుసుకోండి. అంతే కానీ, వేరేవాళ్లు రాసినవి గుడ్డిగా నమ్మేయకండి’’ అని అంటున్నారు నటి అనసూయ. బుల్లితెర వ్యాఖ్యాతగానే కాకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అనసూయ. తాజాగా కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’లో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ‘పైన పటారం...’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను చిత్రబృందం ఇటీవల అభిమానులతో పంచుకుంది.
కాగా, ఓ నెటిజన్.. ‘ఐటమ్ సాంగ్స్ చేయనన్నారు కదా. మరి ఇదేంటండి. అయినా ఆ లిరిక్స్ ఏంటి?’’ అంటూ అనసూయకు ట్వీట్ చేసింది. దీనిపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అది ఐటమ్ సాంగ్ కాదు. అసలు ఐటమ్ సాంగ్ అనేది లేదమ్మా. ఒక పాట కోసం, సినిమాలో ఉన్న నటీనటుల్ని కాకుండా ప్రత్యేకంగా వేరే ఎవరినైనా తీసుకున్నప్పుడు దాన్ని ‘స్పెషల్’ సాంగ్’ అంటారు. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసే కొందరు ఇచ్చిన పేరు (ఐటమ్సాంగ్) అది. లిరిక్స్ నచ్చడం వల్లే నేను ఆ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను. అంతే కాకుండా.. స్పెషల్ సాంగ్స్ చేయనని నేనెప్పుడూ చెప్పలేదు. నా గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే సోషల్ మీడియా వేదికగా నన్ను అడిగి తెలుసుకోండి. ఇప్పుడు చేసినట్లు వెటకారంగా కాకపోయినా, నిజాయతీగా తెలుసుకోవాలని మీకుంటే ట్వీట్ చేయండి.. నేను సమాధానమిస్తాను. అవాస్తవాలను దయచేసి గుడ్డిగా నమ్మకండి. నా నమ్మకాలు, అభిరుచులే నా కెరీర్. అంతేకానీ వేరే ఎవరో ఏదో రాస్తే అది నా కెరీర్ కాదు’’ అని అనసూయ సమాధానమిచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Punjab: డ్రగ్స్ స్మగ్లింగ్పై ఉక్కుపాదం.. 5,500 మంది పోలీసులు.. 2వేల చోట్ల దాడులు!
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్