Anil ravipudi: ‘ఎఫ్4’ లో మూడో హీరో వస్తాడు!
‘‘నిర్మాణ వ్యయం ఎక్కువే అయినా.. ఇంటిల్లిపాదీ కలిసి చూడాల్సిన చిత్రం ఎఫ్3. అందుకే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించేలా నిర్మాత దిల్రాజు నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్కి తీసుకొస్తుందీ చిత్రం. ‘ఎఫ్2’ని మించిన వినోదాన్ని ఇందులో ఆస్వాదిస్తార’’ని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ‘ఎఫ్2’తో వెంకటేష్,
‘‘నిర్మాణ వ్యయం ఎక్కువే అయినా.. ఇంటిల్లిపాదీ కలిసి చూడాల్సిన చిత్రం ఎఫ్3. అందుకే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించేలా నిర్మాత దిల్రాజు నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్కి తీసుకొస్తుందీ చిత్రం. ‘ఎఫ్2’ని మించిన వినోదాన్ని ఇందులో ఆస్వాదిస్తార’’ని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ‘ఎఫ్2’తో వెంకటేష్, వరుణ్తేజ్లని కో బ్రదర్స్గా చూపించి నవ్వించారు. మరోసారి అవే పాత్రలతో ‘ఎఫ్3’ని తీశారు. తెలుగులో వస్తున్న ఫ్రాంచైజీ చిత్రమిది. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు కొత్త. ‘ఎఫ్3’ తీయాలనుకున్నప్పుడు మీ మనసులో మెదిలిన ఆలోచనలేమిటి?
కామెడీ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. నవ్వించిన సినిమాలు తిరస్కారానికి గురైన దాఖలాలే లేవు. వాళ్లకి వినోదం పంచితే చాలు. తెలుగులో ఫ్రాంచైజీ కొత్తే కానీ... బాలీవుడ్లో ‘గోల్మాల్’ సినిమాల తరహాలో మనకీ నవ్వుకోవడానికి ఓ సిరీస్ ఉండాలని చేస్తున్న ప్రయత్నమే ఈ సినిమాలు. కథపరంగా ‘ఎఫ్2’ కంటే ఎక్కువగా కసరత్తులు చేశాం.
‘ఎఫ్2’ కథని కాకుండా... ఆ ప్రాతల్ని మాత్రమే తీసుకోవడానికి కారణమేమిటి?
కొత్త కథని చెప్పాలనుకున్నాం. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన అంశాలతోనే ఆ కథ సాగుతుంది. ‘ఎఫ్2’లో భార్యాభర్తల మధ్య ఫన్, ఫ్రస్ట్రేషన్ అయితే... ఇందులో డబ్బు గురించి వచ్చే ఫ్రస్ట్రేషన్. ఇది ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అంశం. డబ్బు చుట్టూ ఉండే ఆశ, అత్యాశ, కుట్ర, మోసం ఇవన్నీ చాలా బాగా పండాయి. తొలి సినిమా విజయవంతం కావడంతో ఇందులో మరింత ఉత్సాహంగా నటించారు. సునీల్, మురళీశర్మ, అలీ...ఇలా కొత్తమంది కొత్తనటులూ తోడయ్యారు. ఎక్కువ గ్లామర్తోపాటు, ఎక్కువ వినోదంతో సాగుతుందీ చిత్రం. ప్రతి పాత్ర కూడా అత్యాశతో కనిపిస్తుంది. ఎంత ఫన్ ఉంటుందో, అంత కథ ఉంటుంది. డబ్బు గురించి ఇందులో చెప్పిన నిజాలు ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతాయి.
‘ఎఫ్3’ అనగానే మరో హీరో కూడా కనిపిస్తారేమో అని ఆశించారంతా. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మూడో హీరో ఆలోచన ఉందా?
ఆ ఆలోచన కూడా వచ్చింది. అయితే అది అప్పుడే వాడేస్తే తర్వాత సినిమాలకి ఏమీ ఉండదనిపించింది. అందుకే ఆ ఆలోచనని పక్కనపెట్టి ‘ఎఫ్2’ తారలతోనే వీలైనంత వినోదాన్ని సృష్టించాం. ‘ఎఫ్4’లో కానీ, ఆ తర్వాత సినిమాల్లో కానీ మూడో హీరో తప్పకుండా వస్తాడు. అయితే ‘ఎఫ్2’లో ఉన్న పాత్రలకీ, ఇందులో పాత్రలకీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. తొలి సినిమాలో వెంకటేష్కి కుటుంబం అంటూ లేదు. ఇందులో ఉంటుంది. వరుణ్కి అక్కడ కుటుంబం ఉంటుంది, కానీ ఇందులో ఉండదు. కరోనా రెండో దశ తర్వాత కథానాయిక పూజా హెగ్డేతో ఓ పాట చేయించాలని నిర్ణయించాం. కథలోకి పూజాహెగ్డేలానే వచ్చి సెలబ్రేషన్స్ పాటలో ఆడిపాడుతుందామె.
అంత మంది నటులతో కలిసి పనిచేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
మా సెట్లో కారవాన్లన్నీ చూస్తే మినీ మియాపూర్ బస్ డిపోలా ఉండేది. అంతమంది నటులు రోజూ సెట్కి వచ్చేవాళ్లు. ఎవరు ముందు వస్తే వాళ్ల సన్నివేశాల్ని తీసి పంపించడమే. అన్నపూర్ణమ్మ, వై.విజయ టైమ్ అంటే టైమే. వాళ్లు ఉదయం 8 గంటలకే వచ్చేవాళ్లు. అలాంటి క్రమశిక్షణ కలిగిన నటుల్ని నేను చూడలేదు. కరోనా సమయంలో వాళ్ల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నాం. సునీల్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ల తర్వాత ఆయన కడుపుబ్బా నవ్వించే మరో మంచి పాత్ర చేశారు. అలీ సైతం అద్భుతమైన పాత్రలో కనిపిస్తారు. దేవిశ్రీప్రసాద్తో ఇది నాకు మూడో సినిమా. పాటల ఆల్బమ్తోపాటు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది. దిల్రాజుతో సినిమా అంటే సొంత సంస్థలో సినిమా అన్నట్టే ఉంటుంది. అందుకే ఆయనతో నా ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంది.
బాలకృష్ణతో సినిమా ఎలా ఉంటుంది? ఎప్పుడు మొదలవుతుంది?
సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సెట్స్పైకి వెళతాం. బాలకృష్ణ ఎంత శక్తివంతంగా కనిపిస్తారో, అందుకు తగ్గట్టే సినిమా ఉంటుంది. మేమిద్దరం కలిసి ఓ కొత్త రకమైన కథని చేస్తాం.
చాలా మంది నటులుండగా, కథానాయకుల పాత్రల్ని రేచీకటి, నత్తి బాధితులుగా చూపించడానికి కారణమేమిటి?
వినోదం మోతాదు పెంచడానికే. ‘ఎఫ్3’కి వచ్చేసరికి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మామూలు పాత్రకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువగా వినోదం సృష్టించే అవకాశం ఉంటుందనిపించింది. అందుకే ఆ పాత్రల్ని అలా డిజైన్ చేశాం. రాత్రివేళల్లో వచ్చే సన్నివేశాల్లో మాత్రమే వెంకటేష్ అలా రేచీకటితో వినోదం పండిస్తారు. వరుణ్తేజ్ నత్తికి తగ్గట్టుగా మేనరిజమ్ని డిజైన్చేయడం ఓ సవాల్గా అనిపించింది. ముప్పై రకాల మేనరిజమ్స్తో తెరపై కనిపిస్తాడు. జంధ్యాల ‘అహనా పెళ్లంట’ సినిమా ప్రేరణతో వరుణ్ పాత్రని డిజైన్ చేశా.
హాస్య ప్రధానమైన సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. జంధ్యాల, ఈవీవీ స్థానాన్ని భర్తీ చేయాలనేనా?
ప్రస్తుతానికి మన పరిశ్రమలో ఖాళీగా ఉన్న స్థానం అంటే అదే. నేను కూడా మాస్ సినిమాలు చేయాలనే వచ్చా. కామెడీ ఉంటేనే నా సినిమా పరిపూర్ణం అవుతోందనే భావన కలిగింది. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’... ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్ వుందో, అంత కామెడీ కూడా పండింది. అయితే ఇంకా విస్తృతమైన పరిధిలో ప్రేక్షకులకు చేరువ కావాలనే ‘ఎఫ్2’ చేశా. ఒక ప్రణాళిక ప్రకారమే చేసిన ఈ సినిమాతో నాకు కామెడీ బ్రాండ్ వచ్చేసింది. దాన్ని సరిచేసుకోవడానికే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రైలు ఎపిసోడ్ పెట్టాం. ఇప్పుడు ‘ఎఫ్3’తో మళ్లీ కుటుంబ కథ చేశా. తర్వాత బాలకృష్ణ సినిమాతో మళ్లీ మాస్ పంథాలో వెళ్లబోతున్నా. ఇలా ప్రతీ సినిమాకీ వైవిధ్యం ఉండాల్సిందే. ఈ ప్రయాణం నాకూ హాయిగా, ఆరోగ్యంగా ఉంటోంది.
హీరోలు ఇమేజ్ నుంచి బయటికొచ్చి ఇలాంటి పాత్రలు చేయడం అరుదు. మీరు ఈ ఆలోచన చెప్పినప్పుడు వాళ్ల స్పందన ఏమిటి?
కొన్ని సినిమాలు చేయడానికి ఇమేజ్ని దాటి రావాల్సిందే. బాలీవుడ్లో అక్షయ్కుమార్, సల్మాన్ఖాన్లాంటి హీరోలు అదే చేస్తున్నారు. వెంకటేష్ కూడా ఈ సినిమా కోసం పరిమితులేమీ పెట్టుకోకుండా నటించారు. కామెడీ చేసేటప్పుడు అలానే ఉండాలి. ఈ పాత్రల గురించి చెప్పినప్పుడు హీరోలిద్దరూ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాకి వచ్చేసరికి వాళ్లిద్దరూ మరింత సాన్నిహిత్యంతో కలిసి పనిచేశారు. వాళ్ల నటన ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203