పోటీకి సిద్ధమైన సందీప్‌రెడ్డి వంగా

లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకపోవడంతో ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద రిలీజ్‌లు వరస కట్టాయి. దీంతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లు రిలీజ్‌ తేదీలను ప్రకటిస్తున్నాయి.

Published : 01 Mar 2021 15:01 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకపోవడంతో ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద రిలీజ్‌లు వరస కట్టాయి. దీంతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లు రిలీజ్‌ తేదీలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సైతం తన తదుపరి చిత్రం ‘యానిమల్‌’ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ‘కబీర్‌ సింగ్‌’తో మొదటి ప్రయత్నంలోనే బాలీవుడ్‌లో పేరు పొందిన సందీప్‌రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా ‘యానిమల్‌’ ప్రాజెక్ట్‌ తెరకెక్కించనున్నారు. పరిణీతి చోప్రా కథానాయిక. అనిల్‌కపూర్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రకటించారు. భూషణ్‌కుమార్‌, కృష్ణ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని