Anu Emmanuel: విలేకరిపై అను అసహనం.. వేరే ప్రశ్నలేమీ లేవా? అంటూ మండిపాటు

మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నటి అను ఇమ్మాన్యుయేల్‌ అసహనం చెందారు. అలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చారు.

Published : 23 Oct 2022 01:54 IST

హైదరాబాద్‌: సూపర్‌హిట్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు నటి అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel). తాజాగా ఆమెన నటించిన సరికొత్త చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అను కాస్త అసహనం చెందారు.

ఇందులో భాగంగా ఓ విలేకరి.. ‘‘మేడమ్‌ మీరు అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ చేశారు. ఇప్పుడు శిరీష్‌తో ‘ఊర్వశివో రాక్షసివో’ చేశారు. ఈ అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్‌? ఎవరు నాటీ?’’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అసహనానికి గురైన అను.. ‘‘మీకు అడగడానికి వేరే ప్రశ్నలు లేవా? దయచేసి.. కాస్త మంచి ప్రశ్నలు అడగండి’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు . దీంతో ఆ రిపోర్టర్‌.. ‘‘సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏమిటి?’’ అని ప్రశ్నించాడు. ‘‘అది ఇప్పుడే నేను చెప్పకూడదు. ఎందుకంటే సినిమా ఇంకా విడుదల కాలేదు’’ అని ఆమె బదులిచ్చారు. ‘మహా సముద్రం’ తర్వాత అను నటిస్తున్న చిత్రమిది. అల్లు శిరీష్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాకేశ్‌ శశి దర్శకత్వం వహించారు. యువతను ఆకట్టుకునే ప్రేమకథతో దీన్ని తెరకెక్కించారు. అచు రాజ్‌మణి, అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని