Anushka Sharma: విరుష్క జోడీ డిన్నర్‌ సాయంత్రమే.. ఆ హీరోయిన్‌ ఇంటికి వెళ్లినా అంతేనట!

అనుష్కశర్మ- విరాట్‌ కోహ్లీ దంపతులు సాయంత్రమే డిన్నర్‌ చేసి, త్వరగా నిద్రపోతారట. ఈ విషయాన్ని అనుష్క ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Published : 15 Mar 2023 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సాయంత్రం 6- 7 గంటల మధ్య భోజనం చేయాలి.. వీలైనంత త్వరగా పడుకోవాలి.. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది’ అని వైద్యులు చెప్పే మాటలు తరచూ వింటుంటాం. వాటిని కొందరు విని, వదిలేస్తే.. కొందరు మాత్రం ఆ పద్ధతిని తప్పకుండా పాటిస్తుంటారు. ఈ రెండో జాబితాలోకే వస్తారు అనుష్కశర్మ (Anushka Sharma)- విరాట్‌ కోహ్లీ (Virat Kohli). ఈ దంపతులు తాము ఎంతటి బిజీలో ఉన్నా సాయంత్రం 6 అవగానే భోజనం చేసేస్తారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తమ వ్యక్తిగత జీవిత విశేషాలు పంచుకున్నారు.

6కే డిన్నర్‌ చేస్తామన్న అనుష్క రాత్రి 9:30 గం.లకే నిద్రపోతామని తెలిపారు. ‘ఇంట్లో ఉన్నప్పుడు ఓకే. మరి, వేరే ప్రాంతానికో, ఈవెంట్‌కో వెళ్తే ఎలా?’ అనే సందేహంరావడం సహజం. ఇలాంటి ప్రశ్నలకూ ఆమె సమాధానమిచ్చారు. ‘‘కత్రినా కైఫ్‌, విక్కీకౌశల్‌ దంపతులు మమ్మల్ని ఓ రోజు తమ ఇంటికి ఆహ్వానించారు. ఉన్న విషయాన్ని వారికి చెప్పాం. మేం 7- 7:30 గం.ల మధ్య డిన్నర్‌ చేస్తాం.. త్వరగా వెళ్లిపోతాం అని వివరించగానే అందుకు కత్రినా అంగీకరించింది’’ అని అనుష్క తెలిపారు.

విరుష్క జోడీ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుందనే విషయం తెలిసిందే. తమ వ్యాయామానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఈ జంట అభిమానుల్లో స్ఫూర్తినింపుతుంటుంది. చివరిగా 2018లో ‘జీరో’ సినిమాలో కథానాయికగా మెరిసిన అనుష్క త్వరలోనే మళ్లీ ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె తాజా చిత్రం ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’ త్వరలోనే విడుదలకానుంది. ప్రముఖ మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి జీవిత కథతో రూపొందిన చిత్రమది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని