Anushka Sharma: కుటుంబం కోసమే ఈ నిర్ణయం

కుటుంబంపై దృష్టి పెట్టడానికి ఇకనుంచి ఏడాదికి ఒక్క సినిమాలోనే నటిస్తానంటోంది బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయిక అనుష్క శర్మ.

Updated : 03 Jun 2023 12:44 IST

కుటుంబంపై దృష్టి పెట్టడానికి ఇకనుంచి ఏడాదికి ఒక్క సినిమాలోనే నటిస్తానంటోంది బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయిక అనుష్క శర్మ (Anushka Sharma). నాలుగేళ్ల తర్వాత ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోందామె. మహిళా దిగ్గజ క్రికెటర్‌ జులన్‌ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రోసిత్‌ రాయ్‌ దర్శకుడు. ఈ నిర్ణయం అభిమానులకు అంతగా నచ్చకపోయినా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి  వస్తోందంటోంది. ‘నా కూతురు వామికకి ఇది కీలకమైన సమయం. ఈ వయసులో తన ఆలనాపాలనా చూడాలి. విరాట్‌ గొప్ప తండ్రి. తన బాధ్యత చక్కగా నిర్వర్తిస్తాడు. కానీ ఈ సమయంలో తల్లిగా నేనే తనకి ఎక్కువ సన్నిహితంగా ఉండాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నటించడాన్ని నేను బాగా ఆస్వాదిస్తా. కానీ ఇక నుంచి ఎక్కువ చిత్రాలు చేయడం సాధ్యం కాదు. కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడంతో.. ఏడాదికి ఒక్క చిత్రంలో నటించాలనుకుంటున్నా’ అంటూ బెంగళూరులో నిర్వహించిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో తన మనసులో మాట బయట పెట్టింది. నటిగా, భార్యగా, తల్లిగా, సెలెబ్రిటీగా.. నా సంతోషానికి కారణమైన ప్రతి పాత్రను ఆస్వాదించా. ఇందులో ఏది ముఖ్యమైంది అని చెప్పలేనుగానీ.. ఎప్పుడు దేంట్లో సంతృప్తి కలిగితే అదే చేస్తానని ముగించింది అనుష్క.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని