CM Jagan: ఒకరినొకరు పలకరించుకున్న సీఎం జగన్‌, బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరినొకరు పలకరించుకున్నారు.

Updated : 16 Nov 2022 15:03 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరినొకరు పలకరించుకున్నారు. మర్యాదపూర్వకంగా నమస్కరించుకున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు పద్మాలయ స్టూడియోస్‌కు వచ్చిన జగన్‌.. కృష్ణకు పుష్పాంజలి ఘటించి సంతాపం ప్రకటించారు. అనంతరం, కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్‌ను ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. గల్లా జయదేవ్‌, పద్మావతి దంపతులు, సుధీర్‌బాబు, ప్రియదర్శిని దంపతులు, మంజులా, సంజయ్‌ స్వరూప్‌ దంపతులు, నమ్రత, గౌతమ్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులనూ ఆయన పేరుపేరునా పలకరించారు. అదే సమయంలో అక్కడే ఉన్న బాలకృష్ణ, తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు జగన్‌ నమస్కారం చేసి పలకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని