Punch Prasad: పంచ్‌ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. సాయం చేస్తామన్న ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి

‘జబర్దస్త్‌’ నటుడు పంచ్‌ ప్రసాద్‌ (Punch Prasad)కు సాయం చేస్తామంటూ ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి ట్వీట్‌ చేశారు. 

Published : 09 Jun 2023 19:15 IST

హైదరాబాద్‌: ‘జబర్దస్త్‌’ నటుడు పంచ్‌ ప్రసాద్‌ (Punch Prasad) తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఆర్థిక సాయం కోరుతూ ఇటీవల ప్రసాద్‌ స్నేహితులు సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ పోస్ట్‌ను షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణను ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఆయన తమ వంతు సాయం చేస్తామన్నారు. ‘‘పంచ్‌ ప్రసాద్‌ కుటుంబంతో మా టీమ్‌ సంప్రదింపులు జరుపుతోంది. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌కు సంబంధించిన అప్లికేషన్‌ ప్రాసెస్‌ గురించి సూచనలు చేస్తున్నాం. ధ్రువపత్రాలను పరిశీలించడం పూర్తయిన వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సాయం చేస్తాం’’ అని చెప్పారు. 

మూడేళ్ల కిందట పంచ్ ప్రసాద్‌కు రెండు కిడ్నీలూ పాడైపోయాయి. ఆనాటి నుంచి డయాలసిస్‌, ఇతర చికిత్సలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్పక చేయించాల్సిందేనని వైద్యులు తెలిపారని, అయితే, ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేదని, సాయం చేయమని కోరుతూ జబర్దస్త్‌ కమెడియన్‌ నూకరాజు ఓ వీడియో షేర్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని