AP News: సీజ్‌ చేసిన సినిమా థియేటర్లకు ఊరట

ఏపీలో సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది.

Updated : 30 Dec 2021 17:40 IST

అమరావతి: ఏపీలో సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్‌ చేసిన  83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. థియేటర్లు తెరిచిన నెల రోజుల్లోగా అన్ని వసతులు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్‌ (జేసీ)కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్‌ యజమానులు ఈ రోజు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నాని ఈ విషయాలు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని