ఏప్రిల్‌ 28న ‘ఏం జరిగింది..?’

వీరస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏప్రిల్‌ 28న ఏం జరిగింది..?’. రంజిత్‌, శెర్రీ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తణికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వి.జి.ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తోంది. మార్చి 5న ఈ సినిమా విడుదల కానుంది.

Published : 09 Feb 2021 22:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీరస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏప్రిల్‌ 28న ఏం జరిగింది..?’. రంజిత్‌, శెర్రీ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తణికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వి.జి.ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. మార్చి 5న ఈ సినిమా విడుదల కానుంది. కాగా.. ప్రేక్షకుల కోసం చిత్రబృందం స్నీక్‌పీక్‌ను విడుదల చేసింది. చిమ్మచీకటిలో హీరోహీరోయిన్లు ప్రయాణిస్తున్న కారు ఆగిపోగా.. వద్దండీ అంటుండగానే హీరో కారు దిగి అసలేం జరిగిందో చూద్దామని వెళతాడు. కారు ఎక్కి స్టార్ట్‌ చేయగానే వాళ్ల ముందు ఒక్కసారిగా ఏదో ప్రత్యక్షమై భయపెడుతుంది’ ఇలా ఆ వీడియో ఆసక్తికరంగా సాగే ఆ వీడియో మీరూ చూసేయండి.

ఇదీ చదవండి..

జైసల్మేర్‌లో ‘సీటీమార్‌’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని