‘అయ్యప్పనుమ్‌.. కోషియమ్‌’ రీమేక్‌.. ఆ నటుడు తప్పుకున్నాడు!

‘అయ్యప్పనుమ్‌.. కోశియమ్‌’.. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Updated : 30 Aug 2021 21:04 IST

అభిషేక్‌ స్థానంలో అర్జున్‌కపూర్‌

ముంబయి: ‘అయ్యప్పనుమ్‌.. కోషియమ్‌’.. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో పవన్‌-రానా కాంబినేషన్‌లో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. హిందీలో జాన్‌ అబ్రహం- అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌ నుంచి అభిషేక్‌ తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో అర్జున్‌ కపూర్‌ రానున్నారట. బిజూ మేనన్‌ పాత్రలో జాన్‌, పృథ్వీ రాజ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌ తెరపై సందడి చేయనున్నారు. అయ్యప్పనుమ్‌.. చిత్రం కథ నచ్చి కథ రీమేక్‌ హక్కులు కొన్నారు జాన్‌అబ్రహం. జగన్‌శక్తి దర్శకత్వం వహించనున్నారు. నవంబరులో షూటింగ్‌ షురూ కానుంది.

ఆ సినిమాలోనూ అర్జున్‌ ఎంట్రీ ఇలానే..

‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’..  2014లో మోహిత్‌ సూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్‌ విలన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోంది. జాన్‌ అబ్రహం, దిశా పటానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రకి నటుడు ఆదిత్యరాయ్‌కపూర్‌ నటించాల్సి ఉండగా ఆపాత్రను అర్జున్‌కపూర్‌ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని