Aadi: మరోసారి నిరూపించారు: ఆది

ఆది సాయికుమార్‌, నువేక్ష జంటగా నటించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. పొలిమేర నాగేశ్వర్‌ దర్శకుడు. రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది.

Updated : 15 Aug 2022 16:20 IST

ది సాయికుమార్‌, నువేక్ష జంటగా నటించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. పొలిమేర నాగేశ్వర్‌ దర్శకుడు. రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ.. ‘‘బయట కొవిడ్‌ వాతావరణం ఉన్నా.. సినిమాకి ఆదరణ దక్కుతుండటం చాలా ఆనందాన్నిస్తోంది. మంచి చిత్రాల్ని ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఈ చిత్రంలో తల్లీకొడుకుల అనుబంధం మదిని హత్తుకునేలా ఉందని ప్రశంసిస్తున్నారు. అలాగే సప్తగిరి కామెడీ ట్రాక్స్‌కు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రథమార్ధంలో వినోదం.. ద్వితీయార్ధంలో భావోద్వేగాలు చక్కగా పండాయని ప్రేక్షకులు తీర్పు ఇస్తున్నార’’న్నారు దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘బయట కొవిడ్‌ పరిస్థితులున్నా.. మా తొలి ప్రయత్నాన్ని ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని