స్టార్‌ హీరో సినిమా షూట్‌పై రాళ్ల దాడి

బాలీవుడ్‌లో పేరు పొందిన ఓ స్టార్‌హీరోకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమా షూట్‌పై రాళ్ల దాడి జరిగింది. బీటౌన్‌లో యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే....

Updated : 23 Feb 2021 13:05 IST

పలువురికి గాయాలు

ముంబయి: బాలీవుడ్‌లో ఓ స్టార్‌హీరో నటిస్తున్న సినిమా చిత్రీకరణపై రాళ్ల దాడి జరిగింది. బీటౌన్‌లో యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే జాన్‌ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎటాక్‌’. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ధనిపూర్‌లో ప్రారంభమైంది. జాన్‌ అబ్రహంపై పలు యాక్షన్‌ సన్నివేశాలు, బాంబ్‌ బ్లాస్ట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నారు.

కాగా, ఈ సినిమా చిత్రీకరణ గురించి తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో లొకేషన్‌ వద్దకు చేరుకున్నారు. చిత్రబృందాన్ని చూసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమను అడ్డుకున్న భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా లొకేషన్‌లోకి రాళ్లు రువ్వారు. దీంతో పలువురు సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో జాన్‌ అబ్రహంకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇక, రకుల్‌ప్రీత్‌ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని