Ayushmann Khurrana: ఆ పాత్ర వల్ల 80శాతం చూపు కోల్పోయా!
అంధాధున్ మూడేళ్ల పూర్తిచేసుకున్న సందర్భంగా నటుడు ఆయుష్మాన్ ఖురానా చెప్పిన విషయాలు ఇవిగో
ఇంటర్నెట్ డెస్క్: ఆ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు. సినిమా ప్రపంచంలో.. థ్రిల్లర్ జానర్లో అంతకు ముందు.. ఆ తరువాత అనే రీతిలో చెప్పుకునేలా చేసింది ఈ కథ. అదే ఆయుష్మాన్ ఖురానా హీరోగా.. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంధాధున్’’. మూసపద్ధతిలో తీసే చిత్రాలకు చెక్పెడుతూ.. ఓ సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, విలన్, హీరో, హీరోయిన్.. ఇదే కాదు.. ఇంకేదో ఉంది అని అనుకునేవారందరికీ దీంతో జవాబు దొరికేలా చేసింది. కథలో వైవిధ్యం, ఉత్కంఠ రేపే స్క్రీన్ప్లే, పాత్రలో ఒదిగిపోయిన నటులు.. ఇవే ఆ చిత్రానికి జీవం పోశాయి. ఇప్పటికీ గుర్తించుకునేలా చేశాయి.ఈ చిత్రంతో ఆయుష్మాన్ కెరీర్ గ్రాఫ్ అమాంతం దూసుకుపోయింది. ఇందులో ఆకాశ్ అనే పియానో ప్లేయర్గా చూపుకోల్పోయిన వ్యక్తిగా నటించారాయన. మరి ఓ అంధుడిగా కనిపించేందుకు.. అందులో ఒదిగి పోయి నటించేందుకు.. చేసిన కసరత్తుల గురించి ఏమని చెప్పారంటే..
ఐ మాస్క్ ధరించి పనులు చేసేవాడిని: ఆయుష్మాన్ ఖురానా
సవాళ్లతో ఉన్న పాత్రల్లో మెప్పించాలంటే.. ఆ పాత్రలో ఒదగకతప్పదు. అందుకే ఒక్కోసారి ఎంత రిస్క్ అయినా సరే సాహసం చేయకతప్పదు. అలాంటి కథలో నటించాలనేదే నా తపన నాలో ఉండేది. అలా ఎదురుచూస్తున్నప్పుడు అనుకోకుండా ఓ రోజు దర్శకుడు శ్రీరామ్ రాఘవ ఈ స్ర్కిప్ట్ చెప్పేందుకు నా దగ్గరకు వచ్చారు. ఇందులో అంధుడైన పియానిస్ట్గా నటించాలన్నారు. అందుకే చూపుకోల్పోయిన పియానిస్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. నెలల పాటు గంటల కొద్ది పియానో వాయించడం అప్పట్లో నా దినచర్యలో భాగమైంది. అంతేకాదు.. ఐ మాస్క్ ధరించి నారోజూ వారీ పనులు చేసేవాడిని.. ఇదంతా బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకునేందుకు సాయపడింది.
లండన్ నుంచి రూ.6లక్షలు విలువైన లెన్స్ తెప్పించారు..
అంధాధున్లో ఆయుష్మాన్ ఖురానాకు మేకప్, ప్రొస్థెటిక్ డిజైనర్గా పనిచేసిన ప్రీతీ షీల్ సింగ్ మరో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ మిగిలిన చిత్రాల్లో వినియోగించేంత భారీ ప్రొస్థెటిక్ ఏమీ ఇందులో వాడలేదు. కాకపోతే ఆయుష్మాన్ బ్లైండ్ లుక్ కోసం స్పెషల్ లెన్స్ని తెప్పించాము. ఆ పాత్రలో సహజంగా కనిపించేందుకు ప్రత్యేకించి తయారు చేయించాం. అయితే ఇవి మార్కెట్లో దొరికే సాధారణ లెన్స్ కావు. వీటని ‘సెక్లెరల్ లెన్స్’ అంటారు. రెండు కళ్లకు వాడే ఈ లెన్స్ ధర రూ.6లక్షలు ఉంటుంది. ఇది మీ కళ్లు.. కనిపించే భాగాన్ని కవర్ చేస్తుంది. తద్వారా చూపు అంతా మసకబారిపోతుంది. ఈ సమస్యలు ఉంటాయని తెలిసినా సరే.. ఆయుష్మాన్ ఒప్పుకుని మాకు బాగా సహకరించేవాడు. ఇక సెక్లెరల్ లెన్స్ ధరించాక ఆయుష్మాన్ 80శాతం చూపు కోల్పోవాల్సి వచ్చింది. దీనికి తోడు బ్లాక్ గ్లాసెస్ ధరించడంతో 90శాతం ఆయన చూపు దెబ్బతింది. అలానే సినిమా షూట్ మొత్తం పూర్తి చేశాం.
మరిన్ని ఆసక్తికర విషయాలు
* 2018 అక్టోబర్5న విడుదలైన ఈచిత్రం రూ. 32 కోట్ల బడ్జెట్తో రూపొంది.. ప్రపంచ వ్యాప్తంగా రూ.456 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్ ఉంటే చాలు చిన్నచిత్రాలూ బాక్సాఫీస్ను షేక్ చేస్తాయనే నమ్మకాన్ని ఇచ్చింది
* అంధాధున్ చిత్రంతో చక్కటి అభినయం ప్రదర్శించినందుకు గానూ ఆయుష్మాన్కు జాతీయ ఉత్తమనటుడు పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డ్ (క్రిటిక్) సైతం వరించింది.
తెలుగులో మాస్ట్రో
* విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం వేరే భాషల్లోనూ రీమేక్ చేశారు కూడా. ఈఏడాది సెప్టెంబర్ 17న.. తెలుగులో నితిన్ హీరోగా ‘మాస్ర్టో’గా డిస్నీ హాట్స్టార్ ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
మలయాళంలో ‘భ్రమమ్’
* ఈనెల అక్టోబర్ 7న ‘భ్రమమ్’ పేరుతో మలయాళంలో థియేటర్లలోనూ, అమెజాన్ ఓటీటీలోనూ ఒకే రోజు సందడి చేయనుంది. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఇందులో హీరోగా నటించగా.. సినిమాట్రోగ్రాఫర్, దర్శకుడు రవి.కె.చంద్రన్ దీనికి దర్శకత్వం వహించారు.
తమిళంలో అంధాగన్
* తమిళంలో అంధాగన్గా షూటింగ్ పూర్తైనప్పటికీ.. పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడుతోంది. ఇక హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా, తమిళంలో సిమ్రన్, మలయాళంలో మమతామోహన్దాస్ పోషించారు. అంధాధున్లో రాధిక ఆప్టే నటించిన పాత్రను తెలుగులో నభా నటేష్, తమిళంలో ప్రియా ఆనంద్, మలయాళంలో రాశీ ఖన్నా నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.