Tollywood: ఆర్మీ ఆఫీసర్‌ కథతో..

‘బాహుబలి’ ప్రభాకర్‌, షకలక శంకర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు పాలిక్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. రావుల రమేష్‌ నిర్మాత. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌ కొట్టగా.

Updated : 08 Apr 2022 13:55 IST

‘బాహుబలి’ ప్రభాకర్‌, షకలక శంకర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు పాలిక్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. రావుల రమేష్‌ నిర్మాత. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌ కొట్టగా.. ప్రసన్న కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం నటుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ‘‘రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథాంశం. నేనిందులో హీరో అని చెప్పను కానీ, సినిమాకు ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్నా’’ అన్నారు. ‘‘దీన్నొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాగా ముస్తాబు చేస్తున్నాం. ప్రభాకర్‌ ఇందులో చాలా కొత్త కోణంలో కనిపిస్తారు. ఆయన్ని డ్యూయల్‌ షేడ్‌లో చూస్తారు. దీంట్లో మూడు పాటలున్నాయి. ఈ నెలాఖరులో గోవాలో తొలి షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌, అరకులో రెండో షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘చాలా మంచి కథ ఇది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వింధ్యా రెడ్డి, జాన్‌ భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని