Babu Mohan: ఆ సమయంలో చనిపోవాలనుకున్నా: బాబు మోహన్‌

చనిపోయిన తన కుమారుడు గుర్తొచ్చి ప్రముఖ నటుడు బాబు మోహన్‌ భావోద్వేగానికి గురయ్యారు. తనయుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఒకానొక సమయంలో అస్థిపంజరంలా మారానని, చనిపోవాలనుకున్నానని బాధపడ్డారు.

Published : 23 Feb 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చనిపోయిన తన కుమారుడు గుర్తొచ్చి ప్రముఖ నటుడు బాబు మోహన్‌ భావోద్వేగానికి గురయ్యారు. తనయుడి మరణాన్ని జీర్ణించుకోలేక అస్థిపంజరంలా మారానని, ఒకానొక సమయంలో చనిపోవాలనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంబంధిత ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. బాబు మోహన్‌తోపాటు సీనియర్‌ నటీమణులు అన్నపూర్ణ, శ్రీలక్ష్మి తదితరులు ఈ షోకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అతిథులు- యాంకర్‌ సుధీర్‌, రామ్‌ ప్రసాద్‌ మధ్య సాగిన సంభాషణలు, డ్యాన్స్‌ ప్రదర్శనలు, సన్మానాలతో ప్రోమో అలరిస్తోంది. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట డ్యాన్స్‌ ఫెర్ఫామెన్స్‌తో బాబు మోహన్‌ అలరించారు. బస్‌ జర్నీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు. అనంతరం, సన్మాన వేడుకనుద్దేశించి మాట్లాడుతూ ‘‘మా బాబు గుర్తొచ్చాడు. ఇప్పుడు నేను ఆ ఫొటోల గురించి చెప్పలేను. అప్పుడు అస్థిపంజరంలా మారాను. చనిపోవాలనుకున్నా’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని