Tollywood: బాలకృష్ణ-గోపీచంద్‌ మూవీ అలా మారబోతోందా?

బాలకృష్ణ(Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 107’గా

Published : 10 Jan 2022 15:25 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ(Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 107’గా సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాను ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా గోపిచంద్‌ రూపొందిస్తున్నారు. బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. కన్నడ నటుడు దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కీలక పాత్రలు పోషించనున్నట్లు చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయాలన్న ఆలోచనతో ఉందట చిత్ర బృందం. అందుకే ఇతర భాషల్లో పేరున్న నటులను ఈ సినిమా కోసం ఎంపిక చేస్తున్నారట. ఇందులో భాగంగానే దునియా విజయ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు ప్రాజెక్టులోకి వచ్చారని తెలుస్తోంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా గోపిచంద్‌ ఈ సినిమా కథను తీర్చిదిద్దారు. పాన్‌ ఇండియా ప్రాజెక్టుపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని