Veera Simha Reddy: తెలుగు రాష్ట్రాల్లో ఊరమాస్‌ సెలబ్రేషన్స్‌ షురూ

బాలకృష్ణ (Balakrishna) హీరోగా గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతి హాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Published : 12 Jan 2023 10:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) విడుదలతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సంక్రాంతి సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు చలిని  సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. థియేటర్ల బయట భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పాలాభిషేకాలు, టపాసులు కాల్చుతూ, తీన్‌మార్‌ డ్యాన్స్‌లు చేస్తూ హంగామా చేశారు. చిత్ర ప్రదర్శన మొదలయ్యాక కూడా ఇదే తరహా సందడి కనిపించింది. బాలయ్య ఎంట్రీ సీన్స్‌, జై బాలయ్య పాట, పంచ్‌ డైలాగ్‌లు వచ్చినప్పుడు.. కాగితాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు బాలయ్య (Jai Balayya) సైతం అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో బాలయ్య, దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) సందడి చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసిన వీరిద్దరూ కాసేపు అక్కడి వారితో మాట్లాడారు.











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని