Balakrishna: లైవ్‌లో పాట పాడిన బాలకృష్ణ.. చప్పట్లతో మార్మోగిన సభాప్రాంగణం

నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) లైవ్‌లో పాట పాడి అలరించారు. ఆయన పాటతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.

Published : 06 May 2023 13:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనలోని గాయకుడిని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశారు. దోహాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లైవ్‌లో పాట పాడి అలరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో శుక్రవారం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభిమానులు కోరగా.. ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరుని కథ’ నుంచి ‘శివశంకరీ’ పాటను పాడారు. ఆయన పాటకు ప్రేక్షకులు ఫిదా అయి.. చప్పట్లతో తమ అభిమానాన్ని చాటారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు, బాలయ్య గతంలోనూ స్టేజ్‌పైన పాటలు పాడిన విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని