Bandla Ganesh: విజయం తథ్యం.. నా వెనుక ఎవరున్నారో మీకు తెలియదు!
‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు.
హైదరాబాద్: ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా సోమవారం ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో తాను రాకెట్లా దూసుకెళ్తున్నానని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను గెలిస్తే, 100మంది పేద కళాకారులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
‘‘నేను అబద్ధాలు మాట్లాడను. ‘మా’ అసోసియేషన్కు భవనం కావాలి. అయితే, ప్రస్తుతం జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో ప్యాలెస్ కడతామంటే కుదరదు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందో లేదో తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే.. కాస్త దూరమైన కోకాపేట ప్రాంతంలో స్థలం తీసుకుని, 100మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలి. సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి ‘మహాప్రభూ మాకు స్థలం ఇప్పించండి. మా డబ్బులతో ఇళ్లు కట్టుకుంటాం’ అని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తే ఎంత గొప్పపనో మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. అయ్యే పనుల గురించి మాట్లాడితే మంచిది. ఫండ్స్ కోసం ఎక్కడికో విదేశాలకు వెళ్తారట. అంత అవసరమా? తెలుగు చిత్ర పరిశ్రమలో వినోదాన్ని పంచే కళాకారులు ఎంతోమంది ఉన్నాం. అలాంటిది వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి ఫండ్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మన హీరోలు బంగారు గనులు. కోహినూర్ వజ్రాలు. ఆ వజ్రాలు ప్రకాశిస్తే, ఎన్నో భవనాలు కట్టవచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రోగ్రాం చేసి, వచ్చిన డబ్బుతోనే ఇళ్లు కట్టవచ్చు’’
‘‘ప్రస్తుతం ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఏపీ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడను. 11వ తేదీ ప్రెస్మీట్ పెట్టి మరీ మాట్లాడతా. ఈలోగా కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. గత ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఏం చేశారు? మాట్లాడితే కరోనా పేరును అడ్డం పెట్టుకుంటున్నారు. కరోనా రాకపోయుంటే వీళ్లేదో మొత్తం దున్నేసినట్లు చెబుతున్నారు. పాతికేళ్ల నుంచి చూస్తున్నాం. ‘బండ్ల గణేశ్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారు’ అని జీవితా రాజశేఖర్ అనలేదు. దయచేసి ‘మా’లో మాకు గొడవలు పెట్టవద్దు. షూటింగ్ స్పాట్లో ‘మా’ సమస్యలు ప్రస్తావిస్తానని ఓ పెద్దాయన చెప్పాడు. నిర్మాత డబ్బులు పెట్టి సినిమా తీస్తుంటే, అక్కడ చర్చలు పెట్టుకుంటారా? అదంతా తప్పు. ప్రతి రెండో ఆదివారం ‘మా’ మీటింగ్ పెట్టుకుంటే మంచిది. భారతదేశంలో జరిగే ఏ ఎన్నికల్లోనూ 100శాతం ఓట్లు పోలవలేదు. వీలైనంత మంది ఈసారి ఎన్నికల్లో ఓటు వేస్తారు. ప్యానెల్స్ నిర్వహించి పార్టీలకు ‘మా’ సభ్యులు వెళ్లండి. వాళ్లు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించండి. ఓటు వేస్తామని చెప్పండి. వాళ్లు ఇచ్చిన తాయిలాలూ పుచ్చుకోండి. కానీ, మనస్సాక్షికి చెబుతూ నాకు ఓటేయండి. నాకు పరమేశ్వరుడి మద్దతు ఉంది. అధ్యక్షుడిగా ప్రకాశ్రాజ్, విష్ణు ఎవరు గెలిచినా వారు నాకు ప్రెసిడెంటే’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ