Enjoy Enjaami: 2 నెలలు 200 మిలియన్స్ వ్యూస్
Enjoy Enjaami మార్చి 7, 2021న యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ మ్యూజిక్ వీడియో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్డెస్క్: ఒకప్పుడు ‘వై దిస్ కొలవెరి’కి ప్రపంచం వెర్రెత్తిపోయింది.. గంగ్నమ్ డ్యాన్స్కు గంతులేసింది.. ప్రియా ప్రకాశ్ వారియర్ కన్ను కొడితే యువకుల హృదయాలు కుదేలైపోయాయి. ఇలా ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి సామాజిక మాధ్యమాల వేదికగా సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడు ట్రెండ్ ‘ఎంజాయ్ ఎంజామీ’ది. మార్చి 7, 2021న యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ మ్యూజిక్ వీడియో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సింగిల్ సాధించని రికార్డు సృష్టించింది.
అరివు సాహిత్యం అందించిన ఈ పాటను గాయని దీ(దీక్షితా వెంకటేశన్) ఆలపించారు. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణ్ నిర్మించారు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే అన్ని వేదికల్లోనూ ‘ఎంజాయ్ ఎంజామీ’కి విశేష స్పందన లభించింది. తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ ఈ పాటపై ప్రశంసల జల్లు కురిపించారు. ధనుశ్, సాయి పల్లవి, సిద్ధార్థ్, విఘ్నేశ్ శివన్, దుల్కర్ సల్మాన్, లోకేశ్ కనకరాజ్, పా.రంజిత్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, ఇలా ఎంతోమంది మెచ్చుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల వేదికగా ఈ పాటకు వందలాది కవర్ సాంగ్స్ వచ్చాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఈ పాటకు తమదైన శైలిలో స్టెప్లు వేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇక కేరళ, తమిళనాడు పోలీసులు కూడా ఈ పాటతోనే కరోనా వైరస్, మాస్క్ ధరించడంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇంతకీ ఏంటీ ‘ఎంజాయ్ ఎంజామీ’
ఈ పాటకు సాహిత్యం అందించిన వ్యక్తి తమిళ పాటల రచయిత అరివు. గతంలో ‘కాలా’, ‘మాస్టర్’ సహా పలు తమిళ చిత్రాలకు పాటలు రాశారు. అరివు బామ్మ వల్లిఅమ్మాళ్ ఎప్పుడూ తనని ‘ఎంజామీ(మై డియర్, నా దేవుడు) అంటూ పిలుస్తూ ఉండేదట. శ్రీలంకలోని టీఎస్టేట్లలో ఆమె నిర్బంధ కార్మికురాలిగా పని చేశారు. అక్కడి ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, జీవన పరిస్థితుల నుంచే ఈ పాటకు ప్రాణం పోశారు అరివు. బ్రిటిషు పాలకులు తేయాకు తోటల్లో పనిచేసేందుకు భారత్ నుంచి అతి తక్కువ వేతనాలకు కూలీలను శ్రీలంకకు తరలించేవారు. తేయాకు తోటల్లో కొన్నాళ్లు పనిచేసిన అనంతరం కొందరిని యజమానులు నిలిపివేసేవారు. దీంతో వారు గత్యంతరం లేక భవన నిర్మాణ కూలీలుగా ఇతర ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసి జీవనం కొనసాగించేవారు. ఆ నాటి దుర్భర పరిస్థితులకు కళ్లకు కడుతూ ఈ పాటను రచించారు అరివు. మానవత్వం, భూమితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గురించి వర్ణిస్తూ ఈ పాటను ఆవిష్కరించారు. ఈ వీడియో చివర్లో వల్లి అమ్మాళ్ కనపడతారు. ఎన్సామి అంటే తమిళంలో నా దేవుడా అని అర్థం ఆ పదాన్నే శ్రీలంకలో ఎంజామీగా పలుకుతారు.
ఎక్కడెక్కడ వినవచ్చు
ఎంజాయ్ ఎంజామీ పాటను మాజా లేబుల్పై ఏఆర్ రెహమాన్ విడుదల చేశారు. యూట్యూబ్తో పాటు, స్ఫూటిఫై, జియో సావన్, గానా, యాపిల్ మ్యూజిక్, ఐట్యూన్స్, అమెజాన్ మ్యూజిక్, హంగామా, రాగా.కామ్ వేదికల ద్వారా కూడా ఈ సాంగ్ వినవచ్చు. విడుదలైన రెండు వారాల్లోనే స్ఫూటిఫైలో ఈ పాట 2 మిలియన్ స్ట్రీమింగ్స్ దాటింది. మార్చి 10న వీడియో అందుబాటులోకి రాగా రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ దాటేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై