Tammareddy Bharadwaja: అవార్డులు ఇవ్వట్లేదు.. మినీ థియేటర్లకు ప్రోత్సాహం లేదు
కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వటం ఆపేశాయని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆయన స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వటం ఆపేశాయని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భారీ, తక్కువ బడ్జెట్ చిత్రాల వసూళ్ల గురించి మాట్లాడిన అనంతరం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదన్నారు.
‘‘చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి చెప్పాం. ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని కోరాం. ఆ పద్ధతి ద్వారానే నిర్మాతలకు లాభాలు వస్తాయి. ‘పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలి’ అని చాలామంది అన్నారు. రేట్లు పెంచటం వల్ల ‘అర్జున ఫల్గుణ’ సినిమాకి నష్టం వచ్చింది. ‘బంగార్రాజు’ సినిమా ఏపీలో ఎక్కువ వసూళ్లు రాబట్టింది. తెలంగాణలో పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఒక్క ఏపీలో టికెట్ ధరలు తగ్గించటం వల్ల రెవెన్యూకి లోటు ఉండదు. నిర్మాణానికి సంబంధించి చిత్ర పరిశ్రమలోనూ కొన్ని తప్పులు జరిగాయి. ప్రొడక్షన్స్ కాస్ట్ కంట్రోల్ విషయంలో కాస్త కాంప్రమైజ్ అవ్వాలి. అంటే రెమ్యూనరేషన్ తగ్గించుకోమని కాదు విలాసానికి అయ్యే ఖర్చు తగ్గించుకోవాలి. చిరంజీవి ఇటీవల ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. మరోసారి ఆయనతో చర్చించబోతున్నారు. ఆయన్ను ఆహ్వానించినపుడు ఆయనే వెళ్తారు కానీ నేనూ వస్తా అని చెప్పలేం కదా. అందరితో కలిసి వెళ్లినా ఆయన ఒక్కరే వెళ్లినా అది ఇండస్ట్రీ కోసమే. గతంలో.. టికెట్ ధరల్ని ఇష్టమొచ్చినట్టు పెంచి పన్ను కట్టలేదు. అందుకే ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది’’ అని అన్నారు.
‘‘ఆంధ్రాలో ‘పుష్ప’, ‘అఖండ’ చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రొడక్షన్ ఖర్చుని బట్టి ఆయా సినిమాల్ని ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శిస్తుంటారు. ఇలా చేయటం వల్ల వసూళ్లు పెరుగుతాయి. అందుకే ‘పుష్ప’కంటే ‘అఖండ’ పెద్ద హిట్ అయినా తక్కువ కలెక్ట్ చేసింది. చాలామంది ‘మా సినిమా రూ. 300 కోట్లు, రూ.400 కోట్లు కలెక్ట్ చేసింది’ అని చెప్తున్నారు. వచ్చిన లాభంలో ప్రభుత్వానికి సంబంధిత ట్యాక్స్ కడితే వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది. మనమంతా నర్మగర్భంగా కాకుండా ప్రభుత్వంతో సానుకూలంగా చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోవాలి. పెద్ద సినిమాలతోపాటు ఎప్పుడూ 5వ షోలో చిన్న సినిమాలని ప్రదర్శిస్తే వాటికి మనుగడ ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు.
* గతంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేసి నంది అవార్డులు ఇస్తామని చెప్పాయి కానీ ఇప్పటి వరకూ ప్రకటించలేదు.
* చిన్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి.
* మినీ థియేటర్లను ప్రోత్సహించాలి. అప్పట్లో.. ఏపీలో నాలుగు థియేటర్లని ప్రారంభించారు కానీ అధిక సంఖ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అవి ఉన్నట్లైతే ఇప్పుడు థియేటర్ల కొరత పోయేది. చిన్న, పెద్ద సినిమా అని తేడా లేకుండా రెవెన్యూ పెరిగే అవకాశం ఉండేది. తెలంగాణలోనూ చిన్న థియేటర్లను మొదలుపెట్టాలనుకున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు.
* సినీ కార్మికులకి పెద్దగా రెవెన్యూ లేదు. అయినా బిల్లింగ్ పేరు చెప్పి జీఎస్టీ కోతలు వేస్తున్నారు. దానికి బదులుగా ఇఎస్ఐ, పీఎఫ్ వచ్చేలా చేస్తే బాగుంటుంది.
* థియేటర్ల విద్యుత్తు వినియోగాన్ని కమర్షియల్ కిందకు రాకుండా చూడాలి. లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూతపడినా మినిమమ్ ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కమర్షియల్ కేటగిరిలో వాటిని చెల్లించాలంటే చాలా కష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా