Bheemla Nayak: ఒక రోజు ముందుగానే ‘భీమ్లానాయక్‌’ సందడి

పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటించిన ‘భీమ్లానాయక్‌’ ఒక రోజు ముందుగానే ఓటీటీల్లో సందడి చేయనుంది.

Published : 22 Mar 2022 19:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటించిన ‘భీమ్లానాయక్‌’ చిత్రం ఒక రోజు ముందుగానే ఓటీటీల్లో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని మార్చి 25న తమ ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ‘డిస్నీ + హాట్‌స్టార్‌’, ‘ఆహా’ సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ సినీ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాయి. ‘భీమ్లానాయక్‌ మార్చి 24న రిపోర్ట్‌ చేస్తాడు’ అని ట్వీట్‌ చేశాయి. మలయాళంలో ఘన విజయం అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్‌ సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని