Pawan kalyan: ‘భీమ్లానాయక్’ వాయిదా
సంక్రాంతికి రావల్సిన ‘భీమ్లానాయక్’ వాయిదా పడింది. పాన్ ఇండియా చిత్రాలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ల విడుదలని దృష్టిలో ఉంచుకుని ప్రొడ్యూసర్స్ గిల్డ్ అభ్యర్థన మేరకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 12న రావల్సిన ‘భీమ్లానాయక్’
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ కోసమే
ప్రొడ్యూసర్స్ గిల్డ్
సంక్రాంతికి రావల్సిన ‘భీమ్లానాయక్’ వాయిదా పడింది. పాన్ ఇండియా చిత్రాలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ల విడుదలని దృష్టిలో ఉంచుకుని ప్రొడ్యూసర్స్ గిల్డ్ అభ్యర్థన మేరకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 12న రావల్సిన ‘భీమ్లానాయక్’ ఫిబ్రవరి 25న, ఆ రోజున విడుదల చేయాలనుకున్న ‘ఎఫ్3’ని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంగళవారం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఆయా కొత్త విడుదల తేదీల్ని ప్రకటించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ప్రముఖ నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ ‘‘నిర్మాణంలో ఉన్న సినిమాలకీ, విడుదల తేదీల విషయంలోనూ ఎదురయ్యే సమస్యల్ని ఎప్పటికప్పుడు గిల్డ్ తరఫున చర్చించుకుంటూ పరిష్కారం కనుక్కుంటున్నాం. 90శాతం ఫలితాలు వస్తున్నాయి. సంక్రాంతి సినిమాల విషయంలోనూ ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నాం.‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లానాయక్’ పండగ సందర్భంగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ‘ఆర్ఆర్ఆర్,’ ‘రాధేశ్యామ్’లకి ఇబ్బంది కలగకూడదని పండగకి మూడు సినిమాలూ విడుదలైతే థియేటర్ల సమస్య తలెత్తుతుందని భావించి ‘భీమ్లానాయక్’ నిర్మాతల్ని, కథానాయకుడు పవన్కల్యాణ్నీ కలిసి సమస్య వివరించాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దాంతో ‘భీమ్లానాయక్’ని ఫిబ్రవరి 25న, ఆ రోజున మేం విడుదల చేయాల్సిన ‘ఎఫ్3’ని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించాం. నిర్మాతలు, గిల్డ్ అభ్యర్థనని అంగీకరించిన ‘భీమ్లా నాయక్’ బృందానికి ధన్యవాదాలు చెబుతున్నాం. హీరోల అభిమానులు కూడా అర్థం చేసుకుని సహకరించాల’’ని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, డి.వి.వి.దానయ్య, స్రవంతి రవికిశోర్, వంశీ, రాజీవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజమౌళి స్పందన
సినిమాల విడుదల తేదీల్ని వాయిదా వేసిన నిర్మాతలు, కథానాయకుల్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసించారు. ట్విటర్ ద్వారా ఆయన స్పందిస్తూ ‘‘భీమ్లానాయక్’ సినిమాని వాయిదా వేయాలని నిర్మాత చినబాబు, కథానాయకుడు పవన్కల్యాణ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ‘ఎఫ్3’ విడుదలనీ వాయిదా వేసిన నిర్మాత దిల్రాజుకి కృతజ్ఞతలు. సంక్రాంతికి సరైన సినిమా అయినప్పటికీ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని వేసవికి వాయిదా వేసి పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించారు నా హీరో మహేష్బాబు. ఆయా సినిమాలు మంచి విజయాల్ని అందుకోవాల’’ని వ్యాఖ్య చేశారు. ‘రాధేశ్యామ్’ తరఫున యువీ క్రియేషన్స్ కూడా ‘భీమ్లానాయక్’, ‘ఎఫ్3’ బృందాలకి కృతజ్ఞతలు తెలియజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్