BheemlaNayak: ఒకేసారి రెండు ఓటీటీల్లో ‘భీమ్లానాయక్‌’.. ప్రకటించిన టీమ్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘భీమ్లానాయక్‌’. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు....

Published : 18 Mar 2022 10:17 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘భీమ్లానాయక్‌’. బాక్సాఫీస్‌ వద్ద భారీగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘భీమ్లానాయక్‌’ ఓటీటీ రిలీజ్‌పై గురువారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా మార్చి 25 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇక్కడొక చిన్న సర్‌ప్రైజ్‌ కూడా ఉంది. అదేంటంటే.. ‘భీమ్లానాయక్‌’ కేవలం ఆహాలోనే కాకుండా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ అదేరోజు విడుదల కానుంది. ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా విడుదల కావడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌ ఇది తెరకెక్కింది. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. నిత్యామేనన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈచిత్రానికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని