కరోనా బారిన భూమి, విక్కీ

బాలీవుడ్‌లో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఆలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌, అమీర్‌ఖాన్‌, పరేష్‌ రావల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, అక్షయ్‌ కుమార్ తదితర తారలు కొవిడ్‌-19 బారిన పడ్డ విషయం తెలిసిందే.

Published : 05 Apr 2021 18:04 IST

ముంబయి: బాలీవుడ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌, అమీర్‌ఖాన్‌, పరేష్‌ రావల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, అక్షయ్‌ కుమార్ తదితర తారలు కొవిడ్‌-19 బారిన పడ్డ విషయం తెలిసిందే.  తాజాగా యువ నటులు భూమి పెడ్నేకర్‌, విక్కీ కౌశల్‌ ఆ జాబితాలో చేరారు. తమకు కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు.

‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. స్వీయ నిర్బంధంలో ఉన్నాను. వైద్యుల సూచనలు పాటిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నన్ను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్ని తేలికగా తీసుకోవద్దు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోండి. భౌతిక దూరం పాటించండి’ అని భూమి సూచించారు. విక్కీ కౌశల్‌ సైతం ఇదే విషయాన్ని తెలియజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని