Bhumi Pednekar:ఆరింటితో అలరిస్తా!

కరోనా మూడోవేవ్‌ త్వరగా ముగిసిపోతే ప్రేక్షకులను అలరించడానికి ఆరు చిత్రాలతో సిద్ధంగా ఉన్నానంటోంది భూమి పెడ్నేకర్‌. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కమర్షియల్‌ విజయాలు అందుకొంటూ

Updated : 28 Jan 2022 06:55 IST

కరోనా మూడోవేవ్‌ త్వరగా ముగిసిపోతే ప్రేక్షకులను అలరించడానికి ఆరు చిత్రాలతో సిద్ధంగా ఉన్నానంటోంది భూమి పెడ్నేకర్‌. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కమర్షియల్‌ విజయాలు అందుకొంటూ ముందుకెళుతోంది భూమి. వచ్చే నెల 11న ‘బధాయి దో’ చిత్రంతో థియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరింబోతుంది భూమి. ఆ తర్వాత ఆమె నుంచి వరస చిత్రాలు రాబోతున్నాయి. ‘లేడీ కిల్లర్‌’, ‘భీడ్‌’, ‘గోవిందా నామ్‌ మేరా’, ‘రక్షాబంధన్‌’ల్లో నటిస్తోంది. త్వరలోనే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించబోతుందట. ‘‘కరోనా నుంచి ప్రజలు త్వరగా బయటపడిపోతే వాళ్లని అలరించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా నుంచి వరసగా ఆరు వైవిధ్యమైన చిత్రాలు రాబోతున్నాయి. అన్నీ కూడా నా మనసుకు ఎంతో దగ్గరైన పాత్రలే. ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. తొలి సినిమా కోసం ఎంత కష్టపడ్డానో ఇప్పుడు అంతే. ఈ చిత్రాలన్నీ నాలో కొత్త నటిని ప్రేక్షకులు పరిచయం చేస్తాయి’’అని చెబుతోంది భూమి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని