Cinema News: ఆ విధంగా అదృష్టవంతురాలినే!

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్‌లో ఉత్సాహం మొదలైంది. కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన తారలు ఇప్పుడు ఒక్కొక్కరిగా సెట్లోకి అడుగుపెడుతూ...

Updated : 17 Jun 2021 08:39 IST

ముంబయి: కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్‌లో ఉత్సాహం మొదలైంది. కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన తారలు ఇప్పుడు ఒక్కొక్కరిగా సెట్లోకి అడుగుపెడుతూ ఆనంద పడిపోతున్నారు. వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్‌లో గుర్తింపు  తెచ్చుకున్న భూమిపెడ్నేకర్‌ అయితే తన ఆనందానికి అవధుల్లేవు అంటోంది. తాజాగా ఆమె తను నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ కోసం సెట్లోకి అడుగుపెట్టింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘‘మొత్తానికి సెట్లోకి వచ్చేశాను. ఓ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే నాకు షూటింగులో పాల్గొనే అవకాశం దక్కింది. చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. దీన్నుంచి బయటపడటానికి అందరం కలిసికట్టుగా పని చేయాల్సిందే. తిరిగి చిత్ర పరిశ్రమ గాడిలో పడటానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు నిర్మాతలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో వేగంగానే అడుగులు వేస్తున్నారు’’అని చెప్పుకొచ్చింది భూమి. ఆమె ప్రస్తుతం ‘రక్షాబంధన్‌’, ‘బధాయి దో’, ‘మిస్టర్‌ లీ’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని