బాలీవుడ్‌ ‘భాగమతి’ కోసం..

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన బాలీవుడ్‌ నాయిక భూమి పెడ్నేకర్‌ తిరిగి సెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. తెలుగు చిత్రం

Published : 18 Sep 2020 13:23 IST

ముంబయి: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన బాలీవుడ్‌ నాయిక భూమి పెడ్నేకర్‌ తిరిగి సెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. తెలుగు చిత్రం ‘భాగమతి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘దుర్గావతి’లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జి. అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ మార్చిలో నిలిచిపోయింది. ఈ నెల చివర్లో చిత్రీకరణలు పాల్గొని సినిమాని పూర్తి చేయాలని ‘దుర్గావతి’ చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో చిత్రీకరణతో పాటు డబ్బింగ్‌ కూడా పూర్తి చేయాలని భూమి ఆలోచిస్తుంది. ఈ చిత్రంలో జిస్సు సేన్‌గుప్తా, అర్షద్‌ వార్షి, మహిగిల్‌ తదితరులు కీలక పాత్రధారులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని