Bigg Boss Telugu 5: హౌస్ నుంచి జెస్సీ ఔట్..!
బిగ్బాస్ హౌస్ నుంచి జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ బయటకు వెళ్లాడు. ఈ వారం నామినేషన్స్లో సన్నీ, మానస్, కాజల్, సిరి, రవిలు
హైదరాబాద్: బిగ్బాస్ హౌస్ నుంచి జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ బయటకు వెళ్లాడు. ఈ వారం నామినేషన్స్లో సన్నీ, మానస్, కాజల్, సిరి, రవి ఉన్న సంగతి తెలిసిందే. శనివారం సన్నీ సేవ్ అవ్వగా, ఆదివారం సిరి, రవి నామినేషన్స్ నుంచి బయటపడ్డారు. చివరిగా మానస్, కాజల్ మధ్య పోటీ నెలకొనగా, ఇద్దరూ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ సారి నామినేషన్స్లో ఉన్న వాళ్లలో కాజల్కు అతి తక్కువ ఓట్లు పడ్డాయి. అయితే, ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడం, స్ట్రాటజీతో గేమ్స్ ఆడటం, టాస్క్లోనూ తనదైన ముద్రవేయడంతో కాజల్ను కొనసాగించాలని బిగ్బాస్ టీమ్ భావించిందట. ఎలాగూ జెస్సీ వెళ్లిపోతున్నాడు కాబట్టి, అతడి స్థానంలో కాజల్ను కొనసాగించినట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరితో కలిసి ఎక్కువగా..
మోడల్, టెలివిజన్ యాక్టర్ అయిన జస్వంత్ ‘బిగ్బాస్ సీజన్-5’లోకి 8వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. జెస్సీ మొదటి నుంచి సిరి, షణ్ముఖ్తో కలిసి ఉండేవాడు. ఈ ముగ్గురిని త్రిమూర్తులు అంటూ హౌస్మేట్స్ ఆటపట్టించేవారు. నాలుగోవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్లో జెస్సీ గెలిచి ఇంటి కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. ఇక జెస్సీ, సన్నీ మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుండేది. ఆ తర్వాత స్నేహితులుగానూ మారారు. ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ సందర్భంగా బిగ్బాస్ జెస్సీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ క్రమంలో షణ్ముఖ్ తన ఎగ్స్ వదులుకున్నాడు. అయితే, టాస్క్ సరిగా అర్థం చేసుకోలేని జెస్సీ అందులో విఫలమయ్యాడు. అలాగే, థర్మాకోల్ బ్యాగ్స్ టాస్క్కు సంచాలక్గా వ్యవహరించిన సమయంలోనూ టాస్క్ను సరిగా అర్థం చేసుకోలేక పోవడంతో బిగ్బాస్ చురకలు అంటించాడు.
చికిత్స తీసుకున్నా తగ్గని సమస్య..
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఓర్చుకుని గేమ్ ఆడుతున్నాడు జెస్సీ. అయితే, గతవారం రోజులుగా వర్టికో సమస్య తీవ్రమవడంతో హౌస్ నుంచి బయటకు రావాల్సిందిగా బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో వైద్యులతో చికిత్స ఇప్పించి, సీక్రెట్ రూమ్లో ఉంచారు. అప్పటి నుంచి హౌస్లో జరిగే విశేషాలను జెస్సీ సీక్రెట్ రూమ్ నుంచి వీక్షిస్తూ ఉన్నాడు. శనివారం హోస్ట్ నాగార్జున కూడా జెస్సీ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ‘ఇంకా సమస్య తగ్గలేదు’ అని జెస్సీ చెప్పాడు. దీంతో వైద్యుల సూచన మేరకు నిర్ణయం తీసుకుందామని నాగార్జున అన్నారు. ఈ క్రమంలో జెస్సీని ఇంటి నుంచి బయటకు పంపడం ఒక్కటే మార్గమని బిగ్బాస్ టీమ్ భావించించింది. ఈవారం నామినేషన్స్లో లేకపోయినా జెస్సీ అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్బాస్ అతడిని ఇంటి నుంచి పంపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి