Bigg boss telugu 5: టికెట్ టు ఫినాలే విజేత శ్రీరామ్.. టాప్-5లోకి..
బిగ్బాస్ సీజన్-5(Bigg boss telugu 5)లో టికెట్ టు ఫినాలే రసవత్తరంగా సాగింది.
హైదరాబాద్: బిగ్బాస్ సీజన్-5(Bigg boss telugu 5)లో టికెట్ టు ఫినాలే రసవత్తరంగా సాగింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో నలుగురు హౌస్మేట్స్కు ఆసక్తికర టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. టాస్క్లో భాగంగా కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. వాటిని గుర్తుంచుకుని ఒక వరుస క్రమంలో రాయాలి. బిగ్బాస్ అడిగిన వెంటనే చూపించాలి. ఈ టాస్క్ మధ్యలో కాజల్ హింట్స్ ఇవ్వడంపై సన్నీ, శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు. ‘టాస్క్ పేరు ఫోకస్. మీరు దానిపై దృష్టి సారించాలి. నేను అరుస్తూనే ఉంటా’ అని కాజల్ చెప్పుకొచ్చింది. ఇక గురక సౌండ్కు టైగర్ అని, హెలికాప్టర్ సౌండ్కు ట్రాక్టర్ అని సిరి రాయడం నవ్వులు పూయించింది. ఈ టాస్క్లో సన్నీ, మానస్లు గెలుపొందారు. సీజన్ అయిపోయిన తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి సిరికి ట్రాక్టర్ కొనిపెడతామని షణ్ముఖ్ పంచ్లు వేశాడు. మరోవైపు టాస్క్లో హింట్స్ ఇచ్చి విసిగించిన కాజల్తో సన్నీ వాగ్వాదానికి దిగాడు. మానస్ కలగజేసుకుని వారిద్దరికీ సర్ది చెప్పేప్రయత్నం చేశాడు. అయినా కూడా వారిద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి కాజల్ బాధపడటంతో మానస్ ఆమెను ఓదార్చి గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చాడు.
ఇక తర్వాతి టాస్క్లో భాగంగా లైట్స్ ఆఫ్-ఆన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తొలి రౌండ్లో సిరి, సన్నీలు పోటీగా, సిరి గాయపడటంతో ఆమె తరపున షణ్ముఖ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీరామ్, మానస్లు పోటీగా, శ్రీరామ్ తరపున మళ్లీ షణ్ముఖ్ ఆడాడు. అతి తక్కువ సమయంలో అన్నీ లైట్స్ వేసిన శ్రీరామ్, మానస్లు గెలుపొందినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీరామ్ భోజనం చేస్తుండగా ‘పంచదార నీళ్లు కలిపిస్తా. అరటిపండు ఇస్తా’ అంటూ ప్రియాంక చెప్పడంతో ‘సొంత వైద్యం చేయొద్దు’ అంటూ బిగ్బాస్ హెచ్చరించాడు. అందరి ముందూ చెప్పిన బిగ్బాస్ తన పరువు తీశాడని పింకీ చిన్నబోయింది.
చివరిగా టికెటు ఫినాలే 5వ రౌండ్లో మానస్, శ్రీరామ్లు చివరి పోటీదారులుగా నిలిచారు. పోటీదారుల కోసం ఫిల్లర్ ఫ్రేమ్ ఏర్పాటు చేశారు. నాలుగు స్థాయిల్లో బోర్డులను ఉంచారు. రోప్నకు ఉన్న వెయిట్ బ్యాగ్ సాయంతో బోర్డును బద్దలు కొట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా నాలుగు బోర్డులను బద్దలు కొట్టి వెయిట్ బ్యాగ్ను ఫ్రేమ్ చివరకు చేరుస్తారో వారు విజయం సాధించినట్లు అని బిగ్బాస్ ప్రకటించాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన టాస్క్లో అన్నీ బోర్డులు బద్దలు కొట్టి బిగ్బాస్ సీజన్-5 టికెట్ టు ఫినాలే శ్రీరామ చంద్ర గెలుచుకున్నాడు. అంతేకాదు, ఈ సీజన్ టాప్-5లో నిలిచిన తొలి కంటెస్టెంట్ అయ్యాడు. మరోవైపు చివరి టాస్క్లో ఓడిపోయిన మానస్ను సన్నీ ఓదార్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె