bigg boss telugu5: రెండోవారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే!

రెండో వారానికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ సోమవారం జరిగింది. ప్రస్తుతం ఇంటిలో 18మంది సభ్యులు ఉండగా, ఊల్ఫ్‌, ఈగల్‌ టీమ్‌లుగా విడిపోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు.

Published : 14 Sep 2021 10:10 IST

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌5’. రెండో వారానికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ సోమవారం జరిగింది. ప్రస్తుతం ఇంటిలో 18మంది సభ్యులు ఉండగా.. ఊల్ఫ్‌, ఈగల్‌ టీమ్‌లుగా విడిపోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు.

టీమ్‌ ఊల్ఫ్‌లో మానస్‌, సన్నీ విజయ్‌, కాజల్‌, శ్వేత వర్మ, లహరి, రవి, నటరాజ్‌, జస్వంత్‌, ఉమాదేవిలు ఉండగా, టీమ్‌ ఈగల్‌లో లోబో, శ్రీరామ చంద్ర, సిరి, ప్రియాంక, ప్రియ, అనీ మాస్టర్‌, హమీదా, విశ్వ, షణ్ముకలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎదుటి టీమ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులను ఎంపిక చేసుకుని వాళ్లు హౌస్‌లో ఉంటానికి ఎందుకు అర్హులు కారో సరైన కారణాలు చెబుతూ, వాళ్ల ముఖానికి ఎరుపు రంగు పూయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు.

ఈ నామినేషన్‌ ప్రక్రియలో రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు గట్టిగానే జరిగాయి. శ్వేతవర్మ, ఉమాదేవి, అని మాస్టర్‌, లోబో తదితరులు కాస్త తీవ్రంగానే స్పందించారు. చివరిగా ఊల్ఫ్‌ టీమ్‌ నుంచి ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌ నామినేట్‌ కాగా, ఈగల్‌ టీమ్‌ నుంచి లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌లు రెండో వారానికి నామినేట్‌ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని