Bimbisara: తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్త ఊపిరి పోయాలి
‘‘చిత్ర పరిశ్రమకి గడ్డుకాలం అని... థియేటర్కి ప్రేక్షకులు రావడం లేదనీ అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం తెలుగు ప్రేక్షకులది. రానున్న ‘బింబిసార’తోపాటు మరో చిత్రం ‘సీతారామం’ని ఆదరించి తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్త ఊపిరి పోయాలని కోరుకుంటున్నా’’
‘బింబిసార’ వేడుకలో ఎన్టీఆర్
‘‘చిత్ర పరిశ్రమకి గడ్డుకాలం అని... థియేటర్కి ప్రేక్షకులు రావడం లేదనీ అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం తెలుగు ప్రేక్షకులది. రానున్న ‘బింబిసార’తోపాటు (Bimbisara) మరో చిత్రం ‘సీతారామం’ని (SitaRamam) ఆదరించి తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్త ఊపిరి పోయాలని కోరుకుంటున్నా’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ (NTR). ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్రామ్ (Kalyan Ram) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బింబిసార’. కేథరిన్ (Catherine), సంయుక్త మేనన్ (Samyuktha Menon) కథానాయికలు. వశిష్ఠ్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకకి ఎన్టీఆర్ (NTR) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘రెండున్నరేళ్ల కిందట ఒక రోజు కల్యాణ్ అన్న ఫోన్ చేసి ‘నాన్నా ఒక ఆసక్తికరమైన కథ విన్నాను, ఒక్కసారి నువ్వు వింటే బాగుంటుంది’ అని చెప్పారు. అంతకుముందే వశిష్ఠ్ నాకు తెలుసు. కొత్తగా వచ్చాడు, అనుభవం లేదు, ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్ చేయగలడా అనే భయం ఉండేది. కానీ ఆ రోజు ఎంత కసితో చెప్పాడో, అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. ఈ కథలో ఏం జరగబోతోందో తెలుసు నాకు. అంత తెలిసినా ఈ సినిమా చూసినప్పుడు ఎంతో ఆసక్తి కలిగింది. ప్రతి ప్రేక్షకుడూ అంతే ఆసక్తిగా ఈ సినిమాని చూస్తాడు. ‘బింబిసార’ చూస్తున్నప్పుడు కొత్త ఛోటా కె.నాయుడు కనిపించారు. ఈ సినిమాకి అన్నీ ఉన్నా ఇంకా ఎక్కడో ఒక చిన్న వెలితి ఉన్నట్టుగా అనిపించేది. ఆ వెలితిని ఎం.ఎం.కీరవాణి తీర్చారు. ‘బింబిసార’ విషయంలో ఇప్పుడు మాకు భయం లేదు, ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుత తప్ప! ఈ రోజు అద్భుతమైన చిత్రాలు వస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ఇంత అద్భుతంగా సినిమా రావడం వెనక సాంకేతిక నిపుణులు, నటులే కారణం. ప్రేక్షకులకు నచ్చేవరకు చిత్రాలు చేస్తూనే ఉంటామని ఇదివరకు చెప్పాను. అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత అని చెప్పాం. ‘బింబిసార’ విడుదలయ్యాక నందమూరి కల్యాణ్రామ్ కాలర్ పైకి ఎత్తుతారు. ఈ సినిమాకి ముందు, తర్వాత అన్నట్టుగా ఉంటుంది ఆయన కెరీర్. ‘బింబిసార’ కోసం తన రక్తాన్ని ధారపోశారు. ఒక నటుడిగా తనని తాను మలుచుకున్నారు. కల్యాణ్రామ్ కాకపోతే మరెవ్వరూ ఆ పాత్రకి న్యాయం చేయలేర’’న్నారు. అభిమానుల్ని ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నాకూ, మా కల్యాణ్ అన్నకీ... మా తాతగారు, మా నాన్నగారు వదిలి వెళ్లిపోయిన అభిమానులు మీరు. ఎప్పటికీ రుణపడే ఉంటాం. జీవితాంతం ఆనందంగా ఉండేలా నడుచుకుంటాం. వర్షాల్లో కంగారుపడకుండా
జాగ్రత్తగా ఇళ్లకు చేరండని’’ కోరారు.
నందమూరి కల్యాణ్రామ్ (Kalyan Ram) మాట్లాడుతూ ‘‘మనందరికీ చందమామ, అమరచిత్ర కథలంటే చాలా ఇష్టం. జానపద కథా చిత్రాలంటే ఇంకా ఇష్టం. అది మొదలుపెట్టింది మా తాత ఎన్టీఆర్. ఎన్నో సినిమాలు మన ముందుకొచ్చాయి. అదే కోణంలో మేం చేసిన ఓ మంచి జానపద, సోషియో ఫాంటసీ చిత్రమే ‘బింబిసార’. తప్పకుండా థియేటర్కి వెళ్లండి. ఈసారి మాత్రం ఎవ్వరినీ నిరుత్సాహపరచను. ఈ ఏడాది మా తాతగారి శతజయంతి. తెలుగు సినిమాకి, మాకూ మూలకారకుడైన ఆయనకి ఈ సినిమాని అంకితం చేస్తున్నా. కరోనా మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మాకు చక్కటి సహకారం అందించారు నటీనటులు, సాంకేతిక నిపుణులు. బింబిసార’కి కర్త కర్మ క్రియ నిర్మాత హరికృష్ణ. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి అవకాశమిచ్చిన కథానాయకుడు కల్యాణ్రామ్, నిర్మాత హరికి కృతజ్ఞతలు’’ అన్నారు.
కేథరిన్ (Catherine) మాట్లాడుతూ ‘‘చాలా కోణాల్లో ‘బింబిసార’ నాకు ముఖ్యమైన సినిమా. ఇలాంటి నేపథ్యమున్న సినిమాని నేనిదివరకు చేయలేదు’’ అన్నారు. సంయుక్త మేనన్ మాట్లాడుతూ ‘‘నేను తెలుగులో ఒప్పుకున్న మొట్ట మొదటి సినిమా ఇదే. ఇందులో భాగం కావడం గర్వంగా ఉంది. కల్యాణ్రామ్ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఎంతో ఒదిగి ఉంటారు. థియేటర్లో చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎం.కీరవాణి, ఛోటా కె.నాయుడు, చైతన్యప్రసాద్, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, కిరణ్ కుమార్, శ్రీనివాస్రెడ్డి, చమ్మక్చంద్ర, వైవాహర్ష, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు (Latest News)
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!