Bimbisara: మరింత బాధ్యతతో ‘బింబిసార2’ తెరకెక్కిస్తాం: కల్యాణ్‌ రామ్‌

తాను హీరోగా నటించిన ‘బింబిసార’ సినిమా విజయం ప్రేక్షకులకే దక్కుతుందన్నారు నందమూరి కల్యాణ్‌ రామ్‌. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలై, మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

Published : 05 Aug 2022 20:04 IST

హైదరాబాద్‌: తాను హీరోగా నటించిన ‘బింబిసార’ (Bimbisara) సినిమా విజయం ప్రేక్షకులకే దక్కుతుందన్నారు నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram). సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలై, మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌ మీట్‌లో పాల్గొని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. కల్యాణ్ రామ్‌ మాట్లాడుతూ.. ‘‘కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు అధిక సంఖ్యలో వస్తారనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. చిత్ర పరిశ్రమ మొత్తం వారికి జీవితాంతం రుణపడి ఉంటుంది. తొలి ప్రేక్షకుడిగా ఈ సినిమాని చూసి నా తమ్ముడు (ఎన్టీఆర్) (NTR) మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. లవ్‌ యూ నాన్నా. ఇలాంటి మంచి సినిమాలను మరిన్ని మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తున్నా. సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి,  సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు, ఎడిటర్‌ తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌.. అద్భుతమైన ఔట్‌పుట్‌ ఇచ్చిన సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను నాకంటే బాగా నమ్మి, ‘బింబిసార’ కథను నాకు అందించినందుకు దర్శకుడు వశిష్ఠకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయోత్సాహంలో ‘బింబిసార 2’ని మరింత బాధ్యతతో తెరకెక్కిస్తాం’’ అని కల్యాణ్‌ రామ్‌ తెలిపారు. తమ చిత్రం విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ దర్శకుడు వశిష్ఠ్‌ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

త్రిగర్తల సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కల్యాణ్‌ రెండు విభిన్న పాత్రలు పోషించారు. సంయుక్త మేనన్‌, కేథరిన్‌ కథానాయికలుగా నటించారు. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. పలువురు సినీ ప్రముఖులూ సోషల్‌ మీడియా వేదికగా ఈ చిత్ర బృందాన్ని కొనియాడారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని