Anasuya.. అంత ఈజీగా స్టార్ కాలేదు భయ్యా!
అనసూయ.. తెలుగింటి అందాల బొమ్మ. యాంకర్గా మనందర్నీ ప్రతి గురువారం పలకరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్లో నటిగా రాణిస్తున్నారు. ‘రంగమ్మత్త’గా ఫేమ్లోకి వచ్చిన ఈ భామ కేవలం టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, శాండిల్వుడ్లలో సినిమాలు చేస్తూ....
బర్త్డే స్పెషల్.. నటి గురించి కొన్ని విశేషాలు
హైదరాబాద్: అనసూయ.. తెలుగింటి అందాల బొమ్మ. యాంకర్గా మనందర్నీ ప్రతి గురువారం పలకరిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోనూ రాణిస్తున్నారు. ‘రంగమ్మత్త’గా ఫేమ్లోకి వచ్చిన ఈ భామ కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్, శాండిల్వుడ్లలో సినిమాలు చేస్తూ ఫుల్బిజీ అయిపోయారు. బాలీవుడ్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ నటి శనివారం 36వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. చిన్నప్పటి నుంచి తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన అనసూయ గురించి కొన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..
పవిత్ర టు అనసూయ
‘మే 15, 1985లో నేను పుట్టాను. మా సొంత ఊరు నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి. నేనే మా ఇంట్లో పెద్ద అమ్మాయిని. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ నా పేరు పవిత్ర అని పెట్టాలనుకుంది. మా నాన్న మాత్రం వాళ్లమ్మ పేరు పెట్టాలనుకున్నారు. అలా నా పేరు అనసూయ అయ్యింది’’
నాన్న వ్యసనం.. కష్టాలుపడ్డాం..!
‘‘నా చిన్నప్పుడు మేము ఆర్థికంగా స్థితిమంతులమే. మాకు గుర్రాలు కూడా ఉండేవి. ముగ్గురూ ఆడపిల్లలమే అవడం చేత సమాజంలో ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను నాన్నే మాకు నేర్పించారు. మేము చేసే ప్రతి పనిని ఆయన దూరం నుంచే గమనించేవారు. మా నాన్నకు గుర్రపు పందెల వ్యసనం ఉండేది. దానివల్ల మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నేళ్లపాటు అద్దె ఇంట్లో జీవించాం. అద్దె కట్టేందుకు కూడా ఇబ్బందిపడాల్సి వచ్చేది. అమ్మ మిషన్ కుట్టి మా స్కూల్ ఫీజ్ కట్టేది. రూ.50 పైసలు మిగులుతుందని రెండు స్టాపులు నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేదాన్ని ’’
ఆఫర్స్ వదులుకున్నా..
‘‘నేను ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. దాంతో ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగం చేశా. దానికంటే ముందు ఓ బ్యాంక్లో టెలీకాలర్గా కూడా పనిచేశా. అలా నాకు వచ్చిన మొదటి జీతం రూ.5 వేలు. హెచ్ఆర్గా చేస్తున్న సమయంలో మా కంపెనీకి ఎంతోమంది దర్శకులు వస్తుండేవాళ్లు. తమ సినిమాల్లో నాకు అవకాశాలు కూడా ఇచ్చేవాళ్లు. మా ఇంట్లో సినీ రంగం అంటే ఓ రకమైన అభిప్రాయం, భయం ఉండేది. దాంతో వచ్చిన అవకాశాలన్నింటినీ వదిలేసుకున్నాను. అదీ కాక అప్పటికే నాకు నిశ్చితార్థమైపోయింది. కొన్ని కారణాల వల్ల హెచ్ఆర్ జాబ్ మానేయాల్సి వచ్చింది. దాంతో న్యూస్ రీడర్గా మారాను. అలా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను’’
ట్రోల్స్ స్టార్ట్..
‘‘న్యూస్రీడర్గా చేస్తున్న సమయంలో ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోలో వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది. ఆ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాను. నాకు అభిమానులు పెరిగారు. అదే సమయంలో పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కాకపోతే కథలు నచ్చకపోవడంతో నో చెప్పుకుంటూ వచ్చాను. పవన్కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’లోని పార్టీ సాంగ్కు నన్ను అడిగారు. ఆ పాటలో నేను ఒక్కదానినే అయితే చేస్తాను.. లేకపోతే చేయను అని చెప్పాను. దాంతో ఆ అవకాశం చేజారిపోయింది. ఆ పాట విడుదలయ్యాక అదే విషయాన్ని తెలియజేస్తూ.. ‘ఆ పాటలో నేను లేను. గుంపులో గోవిందలా లేకపోవడం మంచిదైంది’ అని ట్వీట్ చేశా. దాంతో నాపై విపరీతమైన ట్రోలింగ్ చేశారు. అప్పటి నుంచి నాకు సోషల్మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. మొదట్లో కామెంట్లు చూసి బాధపడేదాన్ని. ఇప్పుడు కామెంట్లను పట్టించుకోవడం లేదు. నెగెటివ్గా మాట్లాడేవాళ్లకి సరైన సమాధానం చెబుతున్నా’’
‘ఆర్య’ టు ‘రంగస్థలం’..
‘‘నేను హెచ్ఆర్గా చేస్తున్న సమయంలో వృత్తిపరమైన పనుల్లో భాగంగా దర్శకుడు సుకుమార్ మా ఆఫీస్కి వస్తుండేవారు. ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. దాంతో ‘ఆర్య’లో అవకాశం ఇచ్చారు. దాన్ని వదులుకున్నాను. యాంకర్గా రాణిస్తున్న తరుణంలో ‘రంగస్థలం’లో రంగమ్మత్త ఆఫర్ ఇచ్చారు. పాత్ర నచ్చింది. అదీకాక నేను ఎక్స్పోజింగ్ మాత్రమే చేస్తున్నానని అందరూ చెప్పుకునేవాళ్లు. వాళ్లందరికీ సమాధానం చెప్పడం కోసం రంగమ్మత్త క్యారెక్టర్కు ఓకే అన్నాను. అయితే ఆ పాత్రకు అంత ఫేమ్ వస్తుందని ముందు ఊహించలేదు’’
చెప్పలేనంత బాధపడ్డా..
‘‘నేను నటిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘క్షణం’. కానీ విడుదలయ్యింది మాత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఆ సినిమా తర్వాత నేను ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డాం. కాకపోతే అనుకున్న ఫలితాన్ని ఆ సినిమా అందించలేదు. దాంతో ఎంతో బాధపడ్డా. కొన్నిరోజులు బయటకు కూడా రాలేదు’’
బాలీవుడ్లోకి ఎంట్రీ..
‘‘ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతోన్న పలు సినిమాల్లో నటిస్తున్నాను. ‘ఖిలాడి’, ‘రంగమార్తాండ’ చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. మరోవైపు తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. మలయాళంలో మమ్ముట్టి సర్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నా. అవి మాత్రమే కాకుండా బాలీవుడ్లోనూ అవకాశాలు వస్తున్నాయి. కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. రెండు వెబ్సిరీస్లూ చేస్తున్నా’’
ప్రేమ-పెళ్లి..!
‘‘ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్సీసీ పరేడ్ కోసం దిల్లీ వెళ్లాను. అక్కడే నాకు సుశాంక్ భరద్వాజ్తో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే నేనంటే ఇష్టమని చెప్పాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మా మధ్య స్నేహం అలానే కొనసాగింది. మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసి నాన్న పెద్ద గొడవ చేశారు. వేరే సంబంధాలు కూడా చూశారు. ‘నేను సుశాంక్నే పెళ్లి చేసుకుంటా. లేకపోతే అస్సలు పెళ్లే చేసుకోను’ అని ఇంట్లో గట్టిగా చెప్పేశాను. ముందు ఒప్పుకోలేదు. తొమ్మిదేళ్లపాటు ప్రేమ పోరాటం చేసి చివరికి 2010లో మేమిద్దరం వివాహబంధంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు’’
మరికొన్ని సరదా సంగతులు
• అనసూయకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తన ఇంట్లో శునకాలతోపాటు చిలుకల్నీ పెంచుకుంటున్నారు.
• అనసూయ వంట బాగా చేస్తారట. అలాగే ఇష్టమైన వారికి వంట చేసి పెట్టడమంటే ఆమెకు ఎంతో సరదా అట. గతేడాది లాక్డౌన్ సమయంలో ఆమె తన చేతి వంటని అందరికీ చూపించారు.
• అనసూయకు స్టైల్, ట్రెండింగా ఉండటం నేర్పించింది ఆమె భర్త భరద్వాజ్నే అట.
• ఆమె పూర్తిగా శాకాహారి.
• ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆరోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్ తాగి.. ఆ బాధనంతటిని భర్త ముందు వెళ్లగక్కుకుని ప్రశాంతంగా నిద్రపోతారట ఈ బ్యూటీ.
• తనకు వచ్చిన ప్రతి సినిమా ఆఫర్ గురించి తన భర్తతో పంచుకుంటుందట ఈ నటి. కానీ, ఆ సినిమాలో నటించాలా? లేదా? అనే నిర్ణయాన్ని మాత్రం ఆమె తీసుకుంటారట.
• అనసూయ అంత అందంగా, ఫిట్గా కనిపించడానికి కారణం యోగా, వర్కౌట్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత