Bollywood News: కండలు కరిగిస్తున్న జాన్...పెంచుతున్న ఇమ్రాన్
హిందీ చిత్రసీమలో షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్...ఇద్దరూ అగ్ర కథానాయకులే. ఎవరి స్టైల్, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్లది. సాధారణంగా షారుఖ్ రొమాంటిక్ హీరోగా మెరుస్తుంటే.. సల్మాన్ మాస్లో సత్తా చాటుతుంటుంటారు...
ముంబయి: హిందీ చిత్రసీమలో షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్...ఇద్దరూ అగ్ర కథానాయకులే. ఎవరి స్టైల్, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్లది. సాధారణంగా షారుఖ్ రొమాంటిక్ హీరోగా మెరుస్తుంటే.. సల్మాన్ మాస్లో సత్తా చాటుతుంటుంటారు. ఈ ఇద్దరూ నుంచి ఇప్పుడు రెండు చిత్రాలు రానున్నాయి. రెండూ భారీ స్థాయి చిత్రాలే. షారుక్ నుంచి ‘పఠాన్’, సల్మాన్ నుంచి ‘టైగర్ 3’ చిత్రాలు వస్తున్నాయి. ఈ రెండింటిని నిర్మిస్తున్నది ఆదిత్య చోప్రా. పఠాన్లో సల్మాన్. టైగర్లో షారుఖ్ అతిథి పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లోనూ ప్రతినాయక పాత్రలకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటికొచ్చింది.
పఠాన్లో ప్రతినాయకుడిగా జాన్ అబ్రహం, టైగర్ 3లో విలన్గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న విషయం తెలిసిందే. షారుక్ఖాన్ సన్నగా కండలు తిరిగి కనిపిస్తుంటారు. జాన్ అబ్రహంది భారీగా కండలు తిరిగిన శరీరం. పఠాన్లో ఈ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాల్లో విలన్ మరీ భారీగా ఉండటం బాగోదనే ఉద్దేశంతో జాన్ని కాస్త కండలు తగ్గిస్తే బాగుంటుందని నిర్మాత భావిస్తున్నారట. పైగా కథలో ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుందట. దాంతో జాన్ తన కండల్ని కరిగించి సరికొత్త లుక్లోకి మారే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో తెరపై ఇద్దరూ తలపడినప్పుడు చూడటానికి బాగుంటుందనేది చిత్రబృందం ఆలోచనగా కనిపిస్తోంది.
ఇక టైగర్ 3 విషయానికొస్తే సల్మాన్ ‘టైగర్’ ఫ్రాంఛైజీలో వచ్చిన గత రెండు చిత్రాలను మించి తన దేహాన్ని తీర్చిదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. బీస్ట్లా సిద్ధమవుతున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఢీకొట్టే పాత్రలో ఇమ్రాన్ నటిస్తున్నారు. ఆయనేమో నాజూగ్గా ఉంటారు. దాంతో ఇమ్రాన్ కండలతో తన దేహాన్ని మార్చుకోవడానికి సమాయత్తమవుతున్నారు. సల్మాన్కు దీటుగా తన శరీరాన్ని మార్చుకోవడానికి భారీగా కసరత్తులు చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న ‘పఠాన్’ వచ్చే ఏడాది ఈద్ కానుకగా రానుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘టైగర్ 3’ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ముంబయిలోని ఓ స్టూడియోలో పక్కపక్కనే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లలో జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?