Project K: ప్రభాస్‌ కోసమని.. దిశాపటాని

‘లోఫర్‌’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కథానాయిక దిశా పటాని. ఆ తర్వాత బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది. పలు సినిమాల విషయంలో ఆమె పేరు తెరపైకి వచ్చినా... వాటిలో నటించడం  సాధ్యం కాలేదు.

Updated : 09 May 2022 14:16 IST

‘లోఫర్‌’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కథానాయిక దిశా పటాని. ఆ తర్వాత బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది. పలు సినిమాల విషయంలో ఆమె పేరు తెరపైకి వచ్చినా... వాటిలో నటించడం  సాధ్యం కాలేదు. ఈసారి ఆమె ప్రభాస్‌తో జట్టు కడుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం దిశాకి స్వాగతం పలికింది  చిత్రబృందం.ఆ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా బయటపెట్టింది దిశా. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’లో ప్రభాస్‌కి జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక పాత్ర కోసం దిశా పటానీని ఎంపిక చేశారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో   అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని