Instagram: 5కోట్ల ఫాలోవర్లున్న ముద్దుగుమ్మలు
సినిమా హీరోయిన్లకు అందం.. అభినయం.. ఉండాలనేది పాత మాట. వాటితో పాటు చలాకీతనం.. అల్లరి.. కూడా అవసరమే అనేది ఇప్పటి మాట. అప్పుడే ఫాలోవర్లు ప్రకటనలకు పెరుగుతారు. అవును.. సినిమా తారలకు సినిమాలతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లను పెంచుకోవడమూ అంతే కీలకంగా మారింది. హీరోయిన్ల విషయంలో అది మరీ ముఖ్యం.
ఇంటర్నెట్ డెస్క్: సినిమా హీరోయిన్లకు అందం.. అభినయం.. ఉండాలనేది పాత మాట. వాటితో పాటు చలాకీతనం.. అల్లరి.. కూడా అవసరమే అనేది ఇప్పటి మాట. అప్పుడే ఫాలోవర్లు పెరుగుతారు. అవును.. సినిమా తారలకు సినిమాలతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లను పెంచుకోవడమూ అంతే కీలకంగా మారింది. హీరోయిన్ల విషయంలో అది మరీ ముఖ్యం. ఎందుకంటే.. వాళ్లు ఫన్నీ పోస్టులకే కాదు ప్రకటనలకు.. ప్రచార కార్యక్రమాలకు ఇన్స్టాగ్రామ్ వేదికైందిప్పుడు. అందుకే ఫాలోవర్లను పెంచుకోవడానికి హాట్హాట్ ఫొటోలతో పాటు డ్యాన్సులు.. పాటలు.. యోగా.. జిమ్.. ఇలా ఎన్నో రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఎంత చేసినా ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడం అంత సులభమైన పనేం కాదు. అయితే.. కొంతమంది బాలీవుడ్ భామలు తమ ఇన్స్టాగ్రామ్లో 5కోట్ల మంది ఫాలోవర్లతో హవా నడిపిస్తున్నారు. అందులో నలుగురు హీరోయిన్లు ఉండగా.. ఒక సింగర్ కూడా ఉండటం విశేషం. ఇంతకీ వాళ్లెవరో చూసేద్దామా..!
ఇంటర్నేషనల్.. ఇండియన్ బ్యూటీ
ఇటు బాలీవుడ్తో పాటు అటు హాలీవుడ్లోనూ సినిమాలు చేస్తూ అంతర్జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న భామ ప్రియాంక చోప్రా. తన భర్త నిక్జోనస్తో కలిసి దిగిన ఫొటోలతో ఇన్స్టాగ్రామ్లో సందడి చేస్తుంటుంది. ఇక్కడ ఈ జోడీకి క్రేజ్ ఎక్కువే. అప్పుడప్పుడు కాస్త హాట్హాట్ ఫొటోలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. భారత్లో కోహ్లీ తర్వాత 50 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఘనత ప్రియాంకదే. ప్రియాంక ఇప్పటి వరకు 3,365 పోస్టులు చేసింది. ఆమెను 6కోట్ల 32లక్షల మంది ఫాలో అవుతుండగా.. ఆమె 598 మందిని అనుసరిస్తోంది.
సాహో.. శ్రద్ధా
ప్రియాంక తర్వాత అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్. ఈ సాహో భామ ఇన్స్టాగ్రామ్లో ఇప్పటి వరకూ 1,768 పోస్టులు చేసింది. ఆమెను 6కోట్ల 19లక్షల మంది అనుసరిస్తున్నారు. ఆమె మాత్రం 748 మందిని ఫాలో అవుతోంది.
సింగర్.. నేహా కక్కర్
హీరోయిన్కు ఏమాత్రం తీసిపోని సొగసు సింగర్ నేహా కక్కర్ సొంతం. అందమైన గొంతుతో పాటు చలాకీ తనంతో ఎంతో మంది అభిమానం సొంతం చేసుకుంది. అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన సింగర్గా ఇన్స్టాగ్రామ్ను ఏలుతోంది. పలు సినిమాల్లో నటిగానూ అలరించింది. ఆమె ఇప్పటి వరకూ 2,082 పోస్టులు చేసింది. 5కోట్ల 71లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె 428 మందిని అనుసరిస్తోంది.
డిలీట్ చేసినా.. టాప్లోనే దీపిక
ఇన్స్టాగ్రామ్లో సందడి చేసే భామల్లో దీపిక పదుకొణె ఒకరు. తన భర్త రణ్వీర్సింగ్తో కలిసి ఈ భామ చేసే అల్లరి అంతాఇంతా కాదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్స్టాగ్రామ్ పోస్టులన్నీ తొలగించిన ఈ సొట్టబుగ్గల సుందరి అడపాదడపా పోస్టులు చేస్తూ వస్తోంది. తన ఇన్స్టాగ్రామ్లో అన్ని పోస్టులు తొలగించిన తర్వాత మళ్లీ మొదలు పెట్టి 49 పోస్టులు చేసింది. ఆమెను 5కోట్ల 65లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె 143 మాత్రమే అనుసరిస్తోంది.
ఆలియా.. మజాకా..
5కోట్ల ఫాలోవర్లు ఉన్న ఉన్న మరో భామ ఆలియా భట్. ఇటీవల కరోనాపై అవగాహన కల్పించేందుకు ఇన్స్టా వేదికగా వరుస పోస్టులు చేస్తోందీ ఆర్ఆర్ఆర్ భామ. తన చిన్ననాటి ఫొటోలతో పాటు తన సినిమా ప్రమోషన్లు. ఫొటో షూట్లు పంచుకుంటూ ఉంటుంది. ఆమె ఇప్పటి వరకూ 1,705 పోస్టులు చేసింది. ఆమెను 5 కోట్ల 30లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు. 432 మందిని ఆమె ఫాలో అవుతోంది.
జాక్వలైన్.. జోరు
జాక్వలైన్ ఫెర్నాండెజ్.. ఇటీవల 5కోట్ల క్లబ్లో చేరింది. ఇన్స్టాగ్రామ్లోనే కాదు.. బాలీవుడ్లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళుతోందీ శ్రీలంకన్ బ్యూటీ. ఇప్పటి వరకూ 2,272 పోస్టులు చేసింది. 5కోట్ల 5లక్షల మంది ఈ మాజీ మిస్ యూనివర్స్ను ఫాలో అవుతున్నారు. 1,010 మందిని ఈమె తిరిగి అనుసరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!