BRO: ‘బ్రో’ కోసం మళ్లీ బరిలోకి..

‘విరూపాక్ష’ సినిమాతో విజయాన్ని అందుకొని జోరు మీదున్నారు కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌. ఇప్పుడీ జోష్‌లోనే ‘బ్రో’ను పూర్తి చేసేందుకు మళ్లీ బరిలోకి దిగారు.

Updated : 23 May 2023 14:22 IST

‘విరూపాక్ష’ సినిమాతో విజయాన్ని అందుకొని జోరు మీదున్నారు కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌. ఇప్పుడీ జోష్‌లోనే ‘బ్రో’ను పూర్తి చేసేందుకు మళ్లీ బరిలోకి దిగారు. ఆయన.. పవన్‌ కల్యాణ్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది. సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని సముద్రఖని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ.. సెట్లో సాయితేజ్‌తో కలిసి ఉన్న వర్కింగ్‌ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ షెడ్యూల్‌లో తేజుతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఇది పూర్తయ్యాక పవన్‌, సాయితేజ్‌లపై ఓ పాట చిత్రీకరించనున్నారని సమాచారం. దీని కోసం ప్రస్తుతం ఓ పబ్‌ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని