Manchi rojulu vachai: ‘మంచి రోజుల వచ్చాయి’ టీమ్‌కి ప్రభాస్‌, బన్ని విషెస్‌

దీపావళి కానుకగా రేపు (గురువారం) థియేటర్లలో సందడి చేయనున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలు పోషించారు.యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించింది.

Published : 03 Nov 2021 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంతోష్ శోభన్, మెహరీన్‌ జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించింది. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘మంచి రోజులు వచ్చాయి’ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని నమ్మకంగా ఉన్నాం. అటు సందేశం, ఇటు వినోదం.. రెండూ కలిపి చూపించి దర్శకుడు మారుతి సక్సెస్‌ అయ్యారు’’ అని అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ‘మంచి రోజులు వచ్చాయి’ టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ‘సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. దర్శకుడు మారుతి, నిర్మాతలు, నటీనటులు, సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు. ఇక చిత్రానికి సంగీతాన్ని అనూప్‌ రూబెన్స్‌ అందించగా.. సాయిరామ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని