సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుటుంబంలో జరిగిన ఓ శుభకార్యానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు హాజరై సందడి చేశారు. సుకుమార్తె కుమార్తె సుకృతి వేణి వోణీల కార్యక్రమం బుధవారం సాయంత్రం నగరంలోని...

Updated : 25 Feb 2021 11:58 IST

వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుటుంబంలో జరిగిన ఓ శుభకార్యానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు హాజరై సందడి చేశారు. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి వోణీల కార్యక్రమం బుధవారం సాయంత్రం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మహేశ్‌బాబు-నమ్రత, ఎన్టీఆర్‌-ప్రణతీ, నాగచైతన్య-సమంత దంపతులతోపాటు కృతిశెట్టి, రామ్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, కీర్తిసురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. సుకృతిని ఆశీర్వదించి.. సుకుమార్‌తో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని