Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం.. హృదయం ముక్కలైంది: సినీతారల ట్వీట్స్
Odisha Train Tragedy.. ఒడిశా రైలు ప్రమాదం అందర్నీ కలచివేసింది. దీనిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో ఒడిశా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 278 మంది మృతి చెందగా 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ మహా విషాదంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
‘‘రైలు ప్రమాద దుర్ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాల గురించే చింతిస్తున్నాను. ప్రస్తుతం క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటానికి రక్తం ఎంతో అవసరం. కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులందరూ దయచేసి రక్తదానానికి ముందుకు రావాలని కోరుతున్నాను’’ - చిరంజీవి
‘‘ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విని నా హృదయం ముక్కలైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ - అల్లు అర్జున్
‘‘ఇలాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం నిజంగానే బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ - సల్మాన్ ఖాన్
‘‘రైలు ప్రమాద ఘటన నా హృదయాన్ని కలచివేసింది. నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. రెస్క్యూ ఆపరేషన్లో సాయం చేయడానికి ముందుకు వచ్చిన స్థానికులకు ధన్యవాదాలు’’ - యశ్
‘‘రైలు ప్రమాద ఘటనతో నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ - రష్మిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే