సోషల్‌ లుక్‌: రకుల్‌ ధ్యానం.. శిక్షణలో శ్రుతి

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినీ నిర్మాణ పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. షూటింగ్స్‌ లేకపోవడంతో గతకొంతకాలం నుంచి ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ఇప్పుడు ముఖానికి రంగులద్దుకుని కెమెరా ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’...

Updated : 08 Dec 2022 18:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినీ నిర్మాణ పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. షూటింగ్స్‌ లేకపోవడంతో గతకొంతకాలం నుంచి ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ఇప్పుడు ముఖానికి రంగులద్దుకుని కెమెరా ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ప్రతి ఒక్కరూ తప్పక జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు సల్మాన్‌ఖాన్‌ సైక్లింగ్‌తో సేద తీరుతున్నారు. నటి కీర్తి సురేశ్‌ తన తదుపరి సినిమా ‘గుడ్‌లక్‌ సఖి’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ.. ‘సఖి’.. తన జీవితంలో ఎప్పటికీ ఒక భాగమని తెలిపారు. బుల్లితెర యాంకర్‌ అనసూయ తన సరికొత్త లుక్స్‌కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోను అభిమానులతో పంచుకున్నారు. నాని ‘వి’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండగా తాప్సీ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. రకుల్‌ ధ్యాన సాధన చేస్తుంటే, శ్రుతిహాసన్‌ ఫైట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా మన సినీ సెలబ్రిటీలు పంచుకున్న ఆసక్తికర పోస్ట్‌లు మీకోసం..













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని