సోషల్‌ లుక్‌: శ్రుతి మ్యూజిక్‌: సన్నీని చూసి నవ్వొద్దు

కథానాయిక పూజా హెగ్డే  ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌’ సెట్‌లో అడుగుపెట్టారు. కరోనా నేపథ్యంలో ఆమె అసిస్టెంట్‌లు మాస్కులు, సూట్‌లు వేసుకుని ఫొటోకు పోజిచ్చారు. మరోపక్క.. నయనతార తన తల్లి పుట్టినరోజును వేడుకగా జరిపారు. గోవాలోని హోటల్‌లో కేక్‌ కట్ చేస్తున్న ఫొటోను నయన్‌ ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌...

Updated : 25 Mar 2023 17:12 IST

హైదరాబాద్‌: కథానాయిక పూజా హెగ్డే  ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌’ సెట్‌లో అడుగుపెట్టారు. కరోనా నేపథ్యంలో ఆమె అసిస్టెంట్‌లు మాస్కులు, సూట్‌లు వేసుకుని ఫొటోకు పోజిచ్చారు. మరోపక్క.. నయనతార తన తల్లి పుట్టినరోజును వేడుకగా జరిపారు. గోవాలోని హోటల్‌లో కేక్‌ కట్ చేస్తున్న ఫొటోను నయన్‌ ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

శ్రుతిహాసన్‌  పియానో వాయిస్తున్న వీడియోను నెట్టింట్లో పంచుకున్నారు. ఆమె సంగీత కళల్ని ఫాలోవర్స్‌ మెచ్చుకుంటున్నారు. సన్నీ లియోనీ ఫిట్‌గా ఉండటానికి కొత్త కసరత్తులు చేస్తున్నారు. అయితే తొలి ప్రయత్నం విఫలమైంది. దీంతో ‘నన్ను చూసి నవ్వకండి’ అంటూ ఆమె వీడియో షేర్‌ చేశారు.

‘సాగరకన్య’ శిల్పా శెట్టి ఎప్పటిలాగే ఫిట్‌నెస్‌ పరంగా కొత్త సూచనలు ఇచ్చారు. కొన్ని నిమిషాలు యోగా కోసం కేటాయిస్తే.. రోజంతా ఉత్సాహంగా ఉంటామని పేర్కొన్నారు. అదేవిధంగా దర్శకుడు మారుతి కుమార్తె హియాకి ఫొటోగ్రఫీపై మంచి పట్టు ఉందని అల్లు శిరీష్‌ అంటున్నారు. ఆ అమ్మాయి తీసిన తన ఫొటోను పంచుకుంటూ.. ప్రశంసించారు. సమంత బ్లాక్‌ అండ్‌ ఫొటోను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. మరోపక్క కరోనా బారినపడ్డ నటి ప్రీతీ జింటాకు తాజాగా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందట. ఇలా మన తారలు ఫాలోవర్స్‌తో పంచుకున్న ఆసక్తికరమైన పోస్ట్‌లు మీ కోసం..

తమన్నా














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని