Bollywood: క్లిక్‌ క్లిక్‌.. కరణ్‌ జోహర్‌ గ్రాండ్‌ నైట్‌ పార్టీ.. బీటౌన్‌ అంతా అక్కడే..!

బాలీవుడ్‌ సెలబ్రిటీల కోసం తరచూ పార్టీలు హోస్ట్‌ చేస్తుంటారు ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌. ఇందులో భాగంగానే తాజాగా ఆయన ధర్మా ప్రొడెక్షన్స్‌ సీఈవ...

Published : 19 Mar 2022 01:18 IST

ముంబయి‌: బాలీవుడ్‌ సెలబ్రిటీల కోసం తరచూ పార్టీలు హోస్ట్‌ చేస్తుంటారు ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌. ఇందులో భాగంగానే తాజాగా ఆయన ధర్మా ప్రొడెక్షన్స్‌ సీఈవో అపూర్వా మెహత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన ఆత్మీయ మిత్రుడు అపూర్వా మెహ్తా 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గురువారం రాత్రి బీటౌన్‌ సెలబ్రిటీలందరికీ ముంబయిలోని తన నివాసంలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. సుమారు రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లో జరిగిన అతిపెద్ద రీయూనియన్‌ ఇదే కావడం విశేషం. ఈ పార్టీలో బాలీవుడ్‌ స్టార్స్‌, వాళ్ల పిల్లలు సందడి చేశారు. షారుఖ్‌ సతీమణి గౌరీ ఖాన్‌, కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌, జాన్వీ కపూర్‌, ఆలియాభట్‌, వరుణ్‌ధావన్‌, అర్జున్‌కపూర్‌, కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌, అనన్యాపాండే, సిద్దార్థ్‌ మల్హోత్ర, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ, కాజోల్‌.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆనాటి స్టార్స్‌ నుంచి యువతరం నటీనటుల వరకూ అందరూ ఈ పార్టీలో భాగమయ్యారు. ఈ గ్రాండ్‌ నైట్‌ పార్టీలో మన రౌడీ విజయ్‌ దేవరకొండ, పూరీ, ఛార్మి కూడా పాల్గొన్నారు. విజయ్‌ నటిస్తున్న ‘లైగర్‌’ ధర్మా ప్రొడెక్షన్స్‌ బ్యానర్‌పైనే నిర్మితమవుతోన్న కారణంగా ఈ టీమ్‌కీ ఇన్విటేషన్‌ అందింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని