చావుకబురు చల్లగా: ఈ డిలీట్‌ సీన్‌ చూశారా?

చావుకబురు చల్లగా చిత్రంలోని డిలీట్‌ను సీన్‌ను ఆహా అభిమానులతో పంచుకుంది

Published : 01 May 2021 22:08 IST

హైదరాబాద్‌: కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మురళీశర్మ, ఆమని కీలకపాత్రలు పోషించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మెప్పించింది. ముఖ్యంగా బస్తీబాలరాజుగా కార్తికేయ నటన, డైలాగ్‌ డెలివరీ విధానం అలరించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని డిలీట్‌ సీన్‌ను ఆహా పంచుకుంది. బస్తీబాలరాజు తన ప్రేమను మల్లికకు చెప్పే సన్నివేశం హృద్యంగా ఉంది. ఆ ఆసక్తికర సన్నివేశాన్ని మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని