వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న‌ ‘ఛ‌త్ర‌ప‌తి’ సెట్‌

హిందీలో రీమేక్‌ చేస్తున్న ‘ఛ‌త్ర‌ప‌తి’ సినిమా సెట్‌కు వర్షం కారణంగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.3 కోట్ల వ్య‌యంతో 6 ఎక‌రాల్లో రూపొందించిన ఓ ఊరి సెట్ పాక్షికంగా దెబ్బ‌తింది.

Updated : 08 Jul 2021 20:18 IST

హైద‌రాబాద్‌: హిందీలో రీమేక్‌ చేస్తున్న ‘ఛ‌త్ర‌ప‌తి’ సినిమా సెట్‌కు వర్షం కారణంగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.3 కోట్ల వ్య‌యంతో 6 ఎక‌రాల్లో రూపొందించిన ఓ ఊరి సెట్ పాక్షికంగా దెబ్బ‌తింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ ఈ రీమేక్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పెన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. ఓ గ్రామం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల కోసం క‌ళా ద‌ర్శ‌కుడు సునీల్ బాబు ఆధ్వ‌ర్యంలో ఈ సెట్ రూపొందింది. ఏప్రిల్ 22 నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభించాల‌నుకున్నారు. కానీ, కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం వ‌ర్షాలు ప‌డ‌టంతో సెట్ డ్యామేజ్ అయింది. చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు సెట్‌ని పునర్నిర్మించే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. రాజ‌మౌళి - ప్రభాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘ఛ‌త్ర‌ప‌తి’ తెలుగులో ఘ‌న విజయం అందుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో వినాయ‌క్‌- శ్రీనివాస్ కల‌యిక‌లో వ‌చ్చిన ‘అల్లుడు శీను’ హిట్ అవ‌డంతో.. ఈ రీమేక్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. టైటిల్‌, హీరోయిన్‌ వివ‌రాలు ఇంకా ఖ‌రారు కాలేదు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని